నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది, ఈ మూవీతో కోరిక తీరిన ఫీలింగ్ కలిగింది.. ఆర్పీ పట్నాయక్ కామెంట్స్
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్గా చేసిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగులో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వస్తోన్న సరికొత్త సినిమా ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనేది సినిమా ట్యాగ్లైన్. త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించారు. సాహితీ అవంచ హీరోయిన్గా చేసిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ రిలీజ్ నిన్న (అక్టోబర్ 31) జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ అవకాశం లేకుండా పోయింది
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా కథ విన్నాను. నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాధ్ డెడికేటెడ్గా ప్యాషనేటెడ్గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే" అని అన్నారు.
"కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్ వాళ్ల పేరెంట్స్ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది" అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.
అద్భుతమైన వర్క్ ఇచ్చారు
"నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను . టెక్నీషియన్స్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అని ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు.
రిషి మాట్లాడుతూ.. "సినిమా చూశాను .చాలా అద్భుతంగా ఉంది. ఆర్పీ పట్నాయక్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక ఎక్స్పీరియెన్స్ ఫిలిం మేకర్ చేసిన సినిమా లాగా ఉంటుంది. పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి" అని అన్నారు.
ఫ్యామిలీ అంతా కూర్చుని
"శ్రీధర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా ఇది. అందరూ కచ్చితంగా చూడండి" అని రిషి తెలిపారు.
యాక్టర్ గోపరాజు రమణ మాట్లాడుతూ.. "ఇది చాలా క్యాచీ టైటిల్. నిత్యం అందరూ వాడే టైటిల్. చాలా మంచి కథ. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. తను చాలా ప్రతిభావంతుడు తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది. అందరు కూడా చాలా అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది" అని వెల్లడించారు.
హీరో క్యారెక్టర్తో
డీవోపీ జగదీష్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో చాలా అద్భుతమైన జర్నీ ఉంటుంది. ఇందులో హీరో క్యారెక్టర్తో అందరూ రిలేట్ అవుతారు. డెఫినెట్గా ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది" అని అన్నారు.
మధుమణి మాట్లాడుతూ.. "చాలా అద్భుతమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా తప్పకుండా అందరూ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.














