...
...
Next Story

Naga Vamsi: పెద్ది బ్లాక్‌బస్టర్ కావాలని ఇండస్ట్రీ మొత్తం పూజలు చేయాల్సిన టైమ్ ఇది: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

Naga Vamsi: టాలీవుడ్ రెవెన్యూ షేరింగ్ వివాదంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో 'పెద్ది' విజయం పరిశ్రమకు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆ వివరాలు మీకోసం.

Published on: May 13, 2026, 19:57:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Naga Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ఆదాయ పంపకాల వివాదం (రెవెన్యూ షేరింగ్) హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత నాగవంశీ పాల్గొని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తలుచుకుంటే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చని, దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశ్రమకు 'పెద్ది' ఒక టేకాఫ్ పాయింట్

Naga Vamsi: పెద్ది బ్లాక్‌బస్టర్ కావాలని ఇండస్ట్రీ మొత్తం పూజలు చేయాల్సిన టైమ్ ఇది: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్
Naga Vamsi: పెద్ది బ్లాక్‌బస్టర్ కావాలని ఇండస్ట్రీ మొత్తం పూజలు చేయాల్సిన టైమ్ ఇది: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం సరైన రెవెన్యూ లేక ఇండస్ట్రీ రక్తం ఓడుతోంది. సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం లేదు. ఈ వేసవి కాలం కూడా మనకు కలిసి రాలేదు. బలమైన కంటెంట్ లేకపోవడం ఒక కారణమైతే, ఐపీఎల్ ప్రభావం మరో కారణం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 'పెద్ది' వంటి భారీ చిత్రం వస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు వస్తారని మేము ఆశిస్తున్నాం" అని ఆయన వివరించారు.

పూజలు చేయాల్సిన సమయం ఇది

"నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కటయ్యి 'పెద్ది' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని పూజలు చేయాలి. ఎందుకంటే ఈ సినిమా గనుక భారీ విజయం సాధిస్తేనే మళ్ళీ థియేటర్ల వద్ద సందడి మొదలవుతుంది. ఆ ఊపుతోనే ఏడాది పొడవునా వచ్చే ఇతర సినిమాలకు ఆదరణ లభిస్తుంది. రాబోయే ఆరు నెలల కాలం టాలీవుడ్ విజయవంతంగా సాగాలంటే, దానికి 'పెద్ది' సినిమానే టేకాఫ్ పాయింట్‌గా నిలవాలి. ఇలాంటి కీలక సమయంలో కొత్త నిబంధనలు పెడుతూ అడ్డంకులు సృష్టించడం ఏమాత్రం సమంజసం కాదు" అని నాగవంశీ ఎగ్జిబిటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నాగవంశీ ఎగ్జిబిటర్ల వివాదంపై ఏమన్నారు?

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అనవసరమైన గొడవలు సృష్టించి సినిమా విడుదలకు అడ్డంకులు కలిగించవద్దని ఆయన కోరారు.

'పెద్ది' సినిమా ప్రాధాన్యత గురించి ఆయన ఏమన్నారు?

గత కొద్దికాలంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి 'పెద్ది' ఒక టేకాఫ్ పాయింట్‌లా పనిచేస్తుందని, ఈ సినిమా విజయం ఇండస్ట్రీ మొత్తానికి అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ వేసవిలో సినిమాలు ఆడకపోవడానికి కారణాలు ఏంటని ఆయన చెప్పారు?

బలమైన కంటెంట్ లేకపోవడం, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల వల్ల ఈ సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాలేదని నాగవంశీ అభిప్రాయపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe