Nagarjuna Digital Arrest: నాగార్జున కుటుంబంలో తీవ్ర కలకలం రేపిన ఒక సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగార్జున తనకు అత్యంత దగ్గరి బంధువు ఒకరు సైబర్ కేటుగాళ్ల వలలో పడి ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు 'డిజిటల్ అరెస్ట్'కు గురైన షాకింగ్ ఘటనను బయటపెట్టారు. కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసిన స్కామర్లు, ఆ తర్వాత పోలీసుల అవతారం ఎత్తి ఎలా భయపెట్టారో ఆయన క్లియర్గా వివరించారు.
గంటల పాటు డిజిటల్ భయం.. అసలు ఏం జరిగింది?

నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హైడ్రామా ఒక ఫేక్ ఫోన్ కాల్తో స్టార్ట్ అయింది. సదరు బంధువు పేరు మీద ఇరాన్ దేశానికి ఒక కొరియర్ పార్సిల్ వెళ్తోందని, అందులో నిషేధిత డ్రగ్స్ (నార్కోటిక్స్) ఉన్నాయని కస్టమ్స్ ఆఫీసర్ల పేరుతో కేటుగాళ్లు బెదిరించారు.
వెంటనే 'పోలీస్ డిపార్ట్మెంట్' నుంచి మాట్లాడేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసు యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్లోకి వచ్చి, ఆమెను ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆర్డర్ వేశాడు. ప్యాకేజీలో డ్రగ్స్ దొరికాయని, ఇల్లు వదిలి వెళ్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తూ దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఆమెను 'డిజిటల్ అరెస్ట్' చేసి తీవ్ర భయాందోళనకు గురిచేసినట్లు నాగార్జున వెల్లడించారు. అయితే ఆమె సమయస్ఫూర్తితో సైబర్ క్రైమ్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పడంతో ఆ క్రైమ్ అక్కడితో ఆగిపోయిందన్నారు.
నాగార్జున పేరు, అడ్రస్తో నాకే ఫోన్లు వచ్చాయి
ఈ రకమైన స్కామ్లు కేవలం తన బంధువులకే కాదు, తనకు కూడా ఎదురయ్యాయని కింగ్ నాగార్జున సంచలన నిజాలు వెల్లడించారు. తన పేరు, సొంత ఇంటి అడ్రస్ చెప్పి మరీ స్కామర్లు ఫోన్ కాల్స్ చేశారని, అవతలి వ్యక్తి నమ్మేలా మాట్లాడటంలో వీళ్లు చాలా ఎక్స్పర్ట్స్ అని ఆయన అన్నారు.
తనతో ఆ వ్యక్తి షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెబుతూ వెళ్లాడని, అయితే తనకు అది సైబర్ క్రైమ్ కాల్ లా అనిపించడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించారు. ఆ దెబ్బతో తాను ఇప్పటికీ తన పాస్వర్డ్ లను నెలకోసారి మారుస్తానని చెప్పారు.
ఏంటి ఈ 'డిజిటల్ అరెస్ట్'? ఎలా రక్షణ పొందాలి?
{{/usCountry}}తనతో ఆ వ్యక్తి షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెబుతూ వెళ్లాడని, అయితే తనకు అది సైబర్ క్రైమ్ కాల్ లా అనిపించడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించారు. ఆ దెబ్బతో తాను ఇప్పటికీ తన పాస్వర్డ్ లను నెలకోసారి మారుస్తానని చెప్పారు.
ఏంటి ఈ 'డిజిటల్ అరెస్ట్'? ఎలా రక్షణ పొందాలి?
{{/usCountry}}ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్న ప్రధానమైన అస్త్రం ఈ డిజిటల్ అరెస్ట్. సీబీఐ, ఈడీ, కస్టమ్స్ లేదా పోలీస్ అధికారులమని చెప్పి ల్యాప్టాప్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోబెట్టడమే ఈ మోసం వెనుక ఉన్న ప్లాన్.
వీడియో కాల్స్ ద్వారా బాధితులను సైకలాజికల్గా భయపెట్టి లక్షలాది రూపాయలు అకౌంట్ల నుంచి లాగేస్తుంటారు. పోలీసులు లేదా ఏ ఇతర ప్రభుత్వ సంస్థలూ వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ ఇలా..
ప్రధాన బాధితులు : సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్
వాడే ఎత్తుగడలు : కస్టమ్స్ పార్సిల్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ బెదిరింపులు
కాల్ రకాలు : వాట్సాప్ / ఐవీఆర్ డిజిటల్ వీడియో కాల్స్
తీసుకోవాల్సిన జాగ్రత్త : ఎలాంటి వీడియో కాల్స్ నమ్మవద్దు, భయపడవద్దు
హెల్ప్లైన్ నంబర్ : సైబర్ క్రైమ్ నేషనల్ నంబర్ 1930