Nagarjuna Pallaburusu: సినిమా క్లైమాక్స్ చూసి సుప్రియ కంటతడి.. నాగ చైతన్య, నాగార్జున కూడా.. శ్మశానంలో పుట్టిన కథ ఇది
Nagarjuna Pallaburusu: పళ్లబురుసు అనే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో సాగే మూవీతో వస్తున్న డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ హిందుస్థాన్ టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలు, ప్రొడ్యూసర్ సుప్రియ, నాగ చైతన్య, నాగార్జున రియాక్షన్ల గురించి వివరించారు.
Nagarjuna Pallaburusu: ఒక చిన్న పళ్లబురుసు చుట్టూ తండ్రీ కొడుకుల మధ్య కోర్టు కేసు నడవడం వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదూ. ఈ శుక్రవారం (ఆగస్టు 14) థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలంగాణ పల్లె బ్యాక్డ్రాప్ లో సాగే 'పళ్లబురుసు'తో యంగ్ ఫిలిం మేకర్ ఉదయ్ చౌహాన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. హిందూస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన డెబ్యూ మూవీ విశేషాలతో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల మైండ్ బ్లాకింగ్ రియాక్షన్స్ను ఆయన బయటపెట్టారు.

క్లైమాక్స్ చూసి ఏడ్చేసిన ప్రొడ్యూసర్ సుప్రియ
గతంలో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రశంసలు పొందిన 'సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్' తీసిన ఉదయ్ చౌహాన్.. ఇప్పుడు 'పళ్లబురుసు' మూవీతో థియేట్రికల్ డెబ్యూ ఇస్తున్నారు. పళ్లబురుసు అంటే తెలంగాణ ప్రాంతీయ భాషలో టూత్బ్రష్ అని అర్థం వచ్చినప్పటికీ, ఈ సినిమా అంతకుమించిన ఎమోషన్స్తో సాగుతుందని డైరెక్టర్ చెప్పారు.
పూర్తి మనసు పెట్టి ఈ సినిమా తీశానని, ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ క్లైమాక్స్ చూశాక కంటతడి పెట్టుకున్నారని ఉదయ్ వివరించారు. "నేను మరో 90 సినిమాలు చేసినా, ఈ కథ మిస్ అయితే జీవితాంతం బాధపడతాను" అని సుప్రియ అనడం తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఎపిక్ స్టూడియోస్ నిర్వాహకుడు వివేక్ క్రిష్ణానీ కూడా ఈ ప్రాజెక్ట్కి ఎంతో సపోర్ట్ ఇచ్చారని చెప్పారు.
నాగార్జున, నాగ చైతన్య ఇచ్చిన క్రేజీ రివ్యూస్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ నిర్మించడంతో ఈ రూటెడ్ కథను అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలకు వినిపించారు. కథ వినగానే నాగ చైతన్య "ఇది చాలా బాగుంది ఉదయ్.. చాలా స్వీట్ అండ్ రూటెడ్ స్టోరీ, త్వరలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇక చిన్నప్పటి నుంచి డెమిగాడ్లా ఆరాధించే కింగ్ నాగార్జున స్వయంగా ఇంటికి పిలిచి కథ వినడం తన జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకమని ఉదయ్ ఆనందం వ్యక్తం చేశారు. నాగ్ సర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదని, తన డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందని చెప్పారు.
శ్మశానంలో ఆ సీన్ చూసి పుట్టిన కథ
తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక టూత్బ్రష్ వల్ల తండ్రీ కొడుకుల మధ్య న్యాయ పోరాటం ఏర్పడుతుంది. సాధారణంగా యువ, వృద్ధులైన క్యారెక్టర్ల మధ్య గొడవలు చూస్తాం.. కానీ ఇందులో ఒక ముసలాయన, ఆయన వృద్ధ తండ్రి మధ్య కోర్టు డ్రామా నడుస్తుండటం చాలా కొత్తగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారు.
తన మునుపటి సినిమా షూటింగ్ కోసం ఒక పల్లెటూరు వెళ్లినప్పుడు, చేను పక్కనున్న శ్మశానంలో 6 అడుగుల ఎత్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బోరున ఏడవడం ఉదయ్ చూశారట. ఆ దృశ్యం మనసులో బాగా నాటుకుపోవడంతో 'పళ్లబురుసు' ఐడియా పుట్టుకొచ్చింది. చుట్టూ ఉన్న జీవితాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నాచురల్ యాక్టర్స్.. అన్నపూర్ణ స్టూడియోస్ సెంటిమెంట్
ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించారు. కమర్షియల్ ఫేసెస్ కంటే కథకు సెట్ అయ్యే అథెంటిక్ యాక్టర్స్ కావాలనే ఉద్దేశంతోనే వారిని ఎంచుకున్నట్లు ఉదయ్ తెలిపారు. తెలంగాణ యాస, కామిక్ టైమింగ్తో ఈ ఇద్దరూ పాత్రల్లో జీవించేశారని కొనియాడారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో పరిచయమైన డైరెక్టర్లు అందరూ సక్సెస్ సాధించారనే సెంటిమెంట్ ఉందో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత తనపై ఉందన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లేదా స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


