నెట్ఫ్లిక్స్లో హారర్ థ్రిల్లర్ మూవీ హవా.. గ్లోబల్ లెవెల్లో ట్రెండింగ్.. ధనుష్ సినిమాను వెనక్కి నెట్టి..
నెట్ఫ్లిక్స్ లోకి గతవారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ దూసుకెళ్తోంది. ధనుష్ నటించిన ఇడ్లీ కడాయ్ మూవీని వెనక్కి నెట్టి గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10 మూవీస్ లో మూడో స్థానంలో నిలవడం విశేషం.
నెట్ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఓ హిందీ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ సంచలనం రేపుతోంది. ఈ మూవీ పేరు ‘బారాముల్లా’. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక వారం వ్యవధిలోనే నెట్ఫ్లిక్స్లో గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల చార్ట్లో 3వ స్థానం దక్కించుకుంది. మరి ఆ మూవీ విశేషాలేంటో తెలుసుకోండి.

'బారాముల్లా' సంచలనం
మానవ్ కౌల్ ప్రధాన పాత్రలో నటించిన 'బారాముల్లా' మూవీ నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో 3వ స్థానానికి చేరుకుంది. ఈ సినిమా ధనుష్ నటించిన ‘ఇడ్లీ కడాయ్’ని (4వ స్థానం) అధిగమించింది.
ఈ జాబితాలో 'మ్యాంగో' మొదటి స్థానంలో, 'ది ఉమన్ ఇన్ ది లైన్' రెండో స్థానంలో ఉన్నాయి. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమా గత శుక్రవారం అంటే నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. కశ్మీర్ లోని బారాముల్లా టౌన్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
'బారాముల్లా' స్టోరీ ఏంటంటే?
బారాముల్లా సినిమాకు ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించాడు. 2025లో విడుదలైన ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ కశ్మీర్లోని బారాముల్లాలో అదృశ్యమవుతున్న పిల్లల వరుస కేసులను పరిశోధించే డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్) చుట్టూ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో రిద్వాన్ తన కుటుంబాన్ని ఒక దెయ్యాలున్న బంగ్లాలోకి మార్చాల్సి వస్తుంది. అక్కడ వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. ఈ దర్యాప్తు స్థానిక జానపద కథలు, రాజకీయ అస్థిరత వంటి అంశాలను కూడా టచ్ చేస్తుంది.
సినిమా కథ కేవలం అతీంద్రియ శక్తులతో ఆగిపోకుండా పోలీసు వ్యతిరేక సెంటిమెంట్ పెరగడం, పిల్లల రాడికలైజేషన్ వంటి కశ్మీర్ ఘర్షణ వాస్తవ ప్రపంచ ప్రభావాలను కూడా మిళితం చేసింది. ఈ సినిమాలో మానవ్ కౌల్ డీఎస్పీ రిద్వాన్ సయ్యద్గా నటించగా, భాషా సుంబ్లి ఆయన భార్య గుల్నార్ పాత్ర పోషించారు. అరిస్టా మెహతా (నూర్), రోహాన్ సింగ్ (అయాన్) వారి పిల్లల పాత్రల్లో నటించారు. 'బారాముల్లా' మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


