నెట్ఫ్లిక్స్ ఇండియా ప్రకటించిన 2026 సినిమాల జాబితాలో 'ఘూస్ఖోర్ పండిత్' (అవినీతి పండితుడు అని అర్థం వచ్చేలా) అనే సినిమా తీవ్ర వివాదానికి దారితీసింది. మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా టైటిల్, కంటెంట్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో మూవీ టీమ్ దిగొచ్చింది.
మనోజ్ బాజ్పాయ్ ఆవేదన

ఈ వివాదంపై ఘూస్ఖోర్ పండత్ మూవీ హీరో మనోజ్ బాజ్పాయ్ ఎక్స్ వేదికగా తొలిసారి స్పందించాడు. దర్శకుడు నీరజ్ పాండే ఇచ్చిన స్టేట్మెంట్ను షేర్ చేస్తూ.. తమ ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని స్పష్టం చేశాడు.
"ప్రజల భావోద్వేగాలను, ఆందోళనలను నేను గౌరవిస్తాను. మేము చేసిన పని వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసినప్పుడు.. ఒక్కక్షణం ఆగి, వారి మాట వినడం మా బాధ్యత. ఒక నటుడిగా నేను కథను, పాత్రను మాత్రమే చూస్తాను. ఇది కేవలం తప్పులు చేసే ఒక వ్యక్తి కథే తప్ప, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు" అని మనోజ్ పేర్కొన్నాడు.
అలాగే ప్రజాల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సినిమా ప్రమోషనల్ మెటీరియల్ ను తాత్కాలికంగా తొలగించాలని నిర్మాతలు నిర్ణయించినట్లు అతడు తెలిపాడు. ఇది తాము ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నామో తెలియజేస్తుందని అన్నాడు.
"అదొక కల్పిత పాత్ర మాత్రమే": నీరజ్ పాండే
దర్శకుడు నీరజ్ పాండే కూడా శుక్రవారం (ఫిబ్రవరి 6) ఒక ప్రకటన విడుదల చేశాడు. "ఈ కథ పూర్తిగా కల్పితం. ఇందులో 'పండిత్' అనేది కేవలం ఆ పాత్రకు ఉన్న ముద్దుపేరు మాత్రమే తప్ప, ఏ కులానికి లేదా మతానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ ఈ టైటిల్ కొందరిని బాధపెట్టిందని మేము గుర్తించాం. అందుకే ప్రమోషనల్ కంటెంట్ ను తొలగిస్తున్నాం. ఒక ఫిలింమేకర్గా బాధ్యతాయుతమైన కథలు చెప్పడమే నా లక్ష్యం" అని అతడు వివరణ ఇచ్చాడు.
చట్టపరమైన చిక్కుల్లో సినిమా..
లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు నీరజ్ పాండే, ఇతర మేకర్లపై కేసు నమోదైంది. 'పండిత్' అనే పదాన్ని అవినీతికి ముడిపెట్టడం ద్వారా బ్రాహ్మణ వర్గాన్ని అవమానించారని, ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
{{/usCountry}}లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు నీరజ్ పాండే, ఇతర మేకర్లపై కేసు నమోదైంది. 'పండిత్' అనే పదాన్ని అవినీతికి ముడిపెట్టడం ద్వారా బ్రాహ్మణ వర్గాన్ని అవమానించారని, ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
{{/usCountry}}సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ అడ్వకేట్ వినీత్ జిందాల్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు పంపింది. సినిమా టైటిల్ ప్రతికూల మూస ధోరణులను ప్రోత్సహిస్తోందని పేర్కొంది.
ఘూస్కోర్ పండత్ అసలు కథేంటి?
మనోజ్ బాజ్పాయ్ ఇందులో అజయ్ దీక్షిత్ అలియాస్ 'పండిత్' అనే అవినీతి పోలీస్ ఆఫీసర్గా నటించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే అతను, ఢిల్లీలో జరిగే ఒక అంతర్జాతీయ కుట్రలో ఎలా చిక్కుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. వివాదం ముదురుతుండటంతో టైటిల్ మారుస్తారా లేదా అనేది చూడాలి.