నెట్ఫ్లిక్స్లోకి మరో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
నెట్ఫ్లిక్స్ లోకి మరో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ ను మంగళవారం (జులై 15) రిలీజ్ చేశారు. రెండు నిమిషాల ఈ ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా సాగింది. అంతు చిక్కని హత్యల చుట్టూ సాగే వెబ్ సిరీస్ ఇది.
థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం మరో సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు మండల మర్డర్స్ (Mandala Murders). ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ ఒరిజినల్ సిరీస్ ను తీసుకొస్తోంది. గతంలోనే సిరీస్ అనౌన్స్ చేయగా.. తాజాగా మంగళవారం (జులై 15) ట్రైలర్ రిలీజ్ చేసింది.

మండల మర్డర్స్ ట్రైలర్
మండల మర్డర్స్ ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి మోల్ చుకానా పడేగా (మూల్యం చెల్లించాల్సిందే) అనే ట్యాగ్లైన్ పెట్టారు. ఇది మనల్ని ఓ మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి నెట్ఫ్లిక్స్ లోకి వస్తోంది. జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చరణ్దాస్పూర్ అనే అడవి నుంచి ట్రైలర్ మొదలైంది. అది అడవి కాదు ఓ ప్రాచీన కాలపు యంత్రం అని, అందులో ఎవరైనా తమ బొటన వేలు త్యాగం చేసి కోరుకున్న వరం పొందవచ్చని వాయిస్ ఓవర్ లో చెబుతారు.
ఆ తర్వాత సీన్ సడెన్ గా వరుస హత్యల వైపు మళ్లుతుంది. బాధితుల శరీర అవయవాలు మిస్ అవుతాయి. ఆ హత్యలను ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రియా థామస్ (వాణీ కపూర్) రంగంలోకి దిగుతుంది. ఈ హత్యలు రెండుతో ఆగవని, మరో ఐదు హత్యలు జరుగుతాయని తేలుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారన్నదే ఈ సిరీస్ కథ. హత్యలకు ఓ మార్మిక ప్రపంచాన్ని జోడిస్తూ ఈ వెబ్ సిరీస్ ను మేకర్స్ ఆసక్తికరంగా మలిచినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
మండల మర్డర్స్ వెబ్ సిరీస్ గురించి..
మండల మర్డర్స్ వెబ్ సిరీస్ ను మనన్ రావత్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వాణీ కపూర్ తోపాటు వైభవ్ రాజ్ గుప్తా, శ్రియ పిల్గావ్కర్, సిద్ధార్థ్ కపూర్, సుర్వీన్ చావ్లా, రఘుబీర్ యాదవ్ లాంటి వాళ్లు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ కావడంతో సహజంగానే ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి.
అందులోనూ నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉంటాయి. దీంతో ఈ సిరీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో జులై 25 నుంచి మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



