నెట్ఫ్లిక్స్లో తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్గా పాపులర్ హీరో.. టీజర్ రిలీజ్
నెట్ఫ్లిక్స్ లోకి తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో ప్రముఖ టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ఓ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటిస్తుండటం విశేషం. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 3) ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు.
నెట్ఫ్లిక్స్ త్వరలోనే తమ ప్లాట్ఫామ్ పైకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. వీటిలో బాగా ఆకర్షిస్తున్నంది సందీప్ కిషన్ నటించిన కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. మంగళవారం (ఫిబ్రవరి 3) ఆ ఓటీటీ టీజర్ రిలీజ్ చేసింది. ఇది ఫన్నీగా సాగిపోయింది.

సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ టీజర్
నెట్ఫ్లిక్స్ గతేడాదే తమ ప్లాట్ఫామ్ లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ గురించి వెల్లడించగా.. అందులో ఈ సూపర్ సుబ్బు కూడా ఉంది. ఇప్పుడీ కామెడీ సిరీస్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటిస్తున్నాడు ప్రముఖ నటుడు సందీప్ కిషన్. చిన్నతనం నుంచి చిల్లర పనులు చేస్తూ పెరిగే అతడు పెళ్లి కోసం ప్రయత్నిస్తూ 60 మందితో నో చెప్పించుకుంటాడు.
ఓవైపు తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి మాకీపూర్ అనే ఊళ్లో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా జాబ్ వస్తుంది. అక్కడ పాస్ పోసినంత ఈజీగా పిల్లలను కంటారంటూ ఈ టీజర్లో చూపించారు. అలాంటి ఊళ్లోకి వెళ్లి కుటుంబ నియంత్రణ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ వెరైటీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ గురించి..
ఈ కామెడీ వెబ్ సిరీస్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ కు రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అనే ట్యాగ్ లైన్ ఉండటం విశేషం. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది. మురళీ శర్మ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. “ఈ టీచర్ నేర్చుకోవడానికి, నేర్పడానికి వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో నెట్ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది.
ఈ తెలుగు వెబ్ సిరీస్ తోపాటు పలు హిందీ వెబ్ సిరీస్ ల టీజర్లను కూడా నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వీటిలో దిండోరా సీజన్ 2, హలో బచ్చో, ముసాఫిర్ కేఫ్, హమ్ హిందుస్థానీలాంటి వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. వీటిలో రిలీజ్ డేట్లతోపాటు ఇతర వివరాలను త్వరలోనే నెట్ఫ్లిక్స్ వెల్లడించనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


