...
...
Next Story

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్ థ్రిల్లర్ మూవీ.. కూతురి కోసం గాంధారిలా మారే తల్లి.. ట్రైలర్ రిలీజ్..

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ లో మరో థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. తాప్సీ పన్ను లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా పేరు గాంధారి. తన కూతురి కిడ్నాప్ కు ప్రతీకారం తీర్చుకునే ఓ కళ్లు కోల్పోయిన తల్లి పాత్రలో తాప్సీ ఇందులో నటించింది.

Published on: Aug 25, 2026, 17:57:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Thriller: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ తాప్సీ పన్ను మరో పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ థ్రిల్లర్‌తో డిజిటల్ స్పేస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వేదికగా రాబోతున్న ఆమె లేటెస్ట్ మూవీ 'గాంధారి' (Gandhari) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 3 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

గాంధారి ట్రైలర్ ఎలా ఉందంటే?

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్ థ్రిల్లర్ మూవీ.. కూతురి కోసం గాంధారిలా మారే తల్లి.. ట్రైలర్ రిలీజ్..
Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి సూపర్ థ్రిల్లర్ మూవీ.. కూతురి కోసం గాంధారిలా మారే తల్లి.. ట్రైలర్ రిలీజ్..

తాప్సీ పన్ను లీడ్ రోల్లో నటిస్తున్న గాంధారి మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం (ఆగస్ట్ 25) రిలీజ్ చేసింది. ఇందులో తన కూతురిని కోల్పోయే తల్లి పాత్రలో తాప్సీ నటించింది. ట్రైలర్ మొదట్లోనే ఆమె కూతురిని ఓ రైల్లో నుంచి ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. తన కూతురిని కాపాడే ప్రయత్నంలో ఆమె ప్రమాదానికి గురైన కళ్లు కోల్పోతుంది.

మహాభారతంలో భర్త కోసం గాంధారి కళ్లకు గంతలు కట్టుకోగా.. ఈ అభినవ గాంధారి కూతురి కోసం గాంధారిలా మారి కిడ్నాపర్ల కోసం వేట సాగిస్తుంది. ఆమె తన కూతురిని కాపాడుకుందా? ఆమె కూతురిలాగే కిడ్నాప్ కు గురైన పలువురు ఇతర బాలికల పరిస్థితి ఏమైంది అన్నది ఈ గాంధారిలో చూడొచ్చు.

'ఒక తల్లి.. ఒక కూతురు'.. అసలు గాంధారి కథేంటి?

నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు పోస్ట్ చేసిన కాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ఒక తల్లి, ఒక కూతురు, రంగులు మార్చే బహురూపుల నగరం.. అందరి ముసుగులు తొలగించడానికి గాంధారి వస్తోంది" అంటూ రాసుకొచ్చిన లైన్స్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

తాప్సీ పన్ను, పవర్‌ఫుల్ రైటర్ కనికా థిల్లాన్ కాంబినేషన్‌కు బాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన 'హసీన్ దిల్‌రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా', 'మన్‌మర్జియా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీలో సంచలన విజయాలు సాధించాయి.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో 'గాంధారి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కనికా థిల్లాన్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ 'కథా పిక్చర్స్' (Kathha Pictures) బ్యానర్‌పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమాకు 'భోంస్లే', 'జోరమ్' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఇంటెన్స్ చిత్రాలను అందించిన దేవశిష్ మఖీజా (Devashish Makhija) దర్శకత్వం వహించారు. ఆయన మార్క్ రియలిస్టిక్ డార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్లు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.

తాప్సీతో పాటు ఈ సినిమాలో ఇష్వాక్ సింగ్, మీతా వశిష్ట్, స్వస్తిక ముఖర్జీ, ఛాయా కదమ్, జటిన్ సర్నా, చందన్ రాయ్ లాంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షార్ పోలీస్, క్లింటన్ సెరెజో అందించిన మ్యూజిక్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ప్రొడక్షన్ టీమ్ చెబుతోంది.

సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ధమాకా

సెప్టెంబర్ 3న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. రివేంజ్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ సెప్టెంబర్ నెలలో గాంధారి ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe