Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జగదీశ్వరి చికిత్స కోసం మాయ బిడ్డ శాంపిల్స్ ల్యాబ్ పరీక్షల్లో మ్యాచ్ కాకపోతే విరాట్ నిన్ను ఇల్లు దాటించేస్తాడని శాలిని హెచ్చరిస్తుంది, భయపెడుతుంది. అయినా మాయ ఏమాత్రం బెదరదు.
శాలినికి అనుమానం

"నా మెడలో విరాట్ కట్టిన తాళి ఉంది, నన్ను ఈ ఇంటి నుంచి ఎవరూ వెళ్లగొట్టలేరు" అని మాయ చాలా నమ్మకంగా బల్లగుద్ది చెబుతుంది. మాయ చూపిస్తున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి శాలినికి ఎందుకో బాగా అనుమానం కలుగుతుంది.
విరాట్తో చంద్ర రొమాంటిక్ గేమ్.. మందర అలెర్ట్!
మరోవైపు చంద్రకళ కావాలనే విరాట్ గదికి వెళ్లి అతడికి దగ్గరగా ఉంటూ రొమాంటిక్గా ప్రవర్తిస్తుంటుంది. ఇదంతా చూసిన మాయకు మండిపోతుంది. మాయ చూస్తుందని మరింత రెచ్చిపోతుంది చంద్రకళ. అదంతా గమనించిన మందర.. చంద్రకళ ప్రవర్తనలో ఏదో పెద్ద తేడా ఉందని అనుమానించి అదే విషయం మాయకు చెప్పి హెచ్చరిస్తుంది.
చంద్రకళకు నిజం తెలిస్తే
కానీ, అదేది మాయ పెద్దగా పట్టించుకోదు. చంద్రకళ రహస్యంగా గుడికి వెళ్లి విరాట్తో నీ పెళ్లి జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకుందని మాయకు మందర చెబుతుంది. అది విన్న మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు చంద్రకళకు నిజం తెలిస్తే పరిస్థితి ఏంటని తెగ భయపడిపోతుంది మాయ.
గుడిలో చంద్రకళ నిజాలు రాబట్టిందని చెప్పిన మందర
మరోవైపు ఇక జగదీశ్వరి, రఘురామ్, విరాట్, మాయలు కలిసి ఆసుపత్రికి చేరుకుంటారు. వైద్యులు అవసరమైన శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తారు. మందర ఫోన్ చేసి చంద్రకళ గుడిలో నిజాలు రాబట్టిందని, మీ పెళ్లి జరగలేదని తెలుసుకుందని చెబుతుంది. దాంతో ఆసుపత్రిలోనే మాయ తెగ వణికిపోతుంటుంది.
90 శాతం మ్యాచ్ అయిన ల్యాబ్ రిపోర్ట్స్
ఇంతలోనే డాక్టర్ వచ్చి, "ల్యాబ్ రిపోర్ట్లో శాంపిల్ 90 శాతం మ్యాచ్ అయ్యింది" అని విరాట్, రఘురామ్లకు చెబుతారు. ఈ మాట వినగానే విరాట్ ఎంతో సంతోషపడతాడు. మరోవైపు చంద్రకళ మనసులో అసలు ఏముంది, తన ప్లాన్ ఏంటో తెలుసుకోమ్మని, తన నుంచి నిజం రాబట్టమని శాలినిని హెల్ప్ అడుగుతుంది మాయ.
ఊహించని బాంబు పేల్చిన చంద్రకళ!
{{/usCountry}}ఇంతలోనే డాక్టర్ వచ్చి, "ల్యాబ్ రిపోర్ట్లో శాంపిల్ 90 శాతం మ్యాచ్ అయ్యింది" అని విరాట్, రఘురామ్లకు చెబుతారు. ఈ మాట వినగానే విరాట్ ఎంతో సంతోషపడతాడు. మరోవైపు చంద్రకళ మనసులో అసలు ఏముంది, తన ప్లాన్ ఏంటో తెలుసుకోమ్మని, తన నుంచి నిజం రాబట్టమని శాలినిని హెల్ప్ అడుగుతుంది మాయ.
ఊహించని బాంబు పేల్చిన చంద్రకళ!
{{/usCountry}}మాయ చెప్పడంతో చంద్రకళ దగ్గరికి వెళ్లిన శాలిని మాటలు కలుపుతుంది. అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రకళ ఊహించని నిజం బయటపెడుతుంది. "విరాట్ను మాయ భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తోంది. అసలు విరాట్, మాయలకు పెళ్లే జరగలేదు" అని చంద్రకళ బాంబ్ పేలుస్తుంది.
షాక్ అయిన శాలిని
చంద్రకళ నోటి నుంచి ఈ నిజం విన్న శాలిని ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. భయంతో శాలినికి చెమటలు పడతాయ్. అలాగే ఖంగుతిని సైలెంట్గా ఉంటుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.