OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 షోస్, మూవీస్ ఇవే.. ఆ రియాల్టీ షోనే నంబర్ వన్.. లిస్ట్‌లో రష్మిక మూవీ, ఓ సీరియల్

OTT Most Watched Shows: ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన లేటెస్ట్ ఓటీటీ వ్యూవర్‌షిప్ రేటింగ్స్‌లో టాప్ 10 షోల జాబితా బయటికొచ్చింది. కేబీసీ, అనుపమ, తారక్ మెహతాలను దాటుకుని నంబర్ 1 స్థానాన్ని ఏ షో కైవసం చేసుకుందో చూడండి.

Published on: Aug 18, 2026, 22:04:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Most Watched Shows: ఓటీటీ ప్రపంచంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. రోజూ ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ డిజిటల్ వేదికలపైకి వస్తూనే ఉంది. ప్రతీ వారం వీక్షకుల అభిరుచులు మారుతుంటాయి. ఈ క్రమంలో ఇండియాలో డిజిటల్ వేదికలపై అత్యధికంగా చూసిన టాప్ 10 షోలు, సినిమాల జాబితాను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఇటీవల విడుదల చేసింది.

OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 షోస్, మూవీస్ ఇవే.. ఆ రియాల్టీ షోనే నంబర్ వన్.. లిస్ట్‌లో రష్మిక మూవీ, ఓ సీరియల్
OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 షోస్, మూవీస్ ఇవే.. ఆ రియాల్టీ షోనే నంబర్ వన్.. లిస్ట్‌లో రష్మిక మూవీ, ఓ సీరియల్

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చిన టీవీ సీరియల్ 'అనుపమ' వరకు, 'ఖత్రోన్ కే ఖిలాడీ' నుంచి 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' వరకు పలు ప్రముఖ షోలు ఈ వారం టాప్ 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.

10 నుంచి 8వ వరకు స్థానాలు ఇలా..

ఈ వారం జాబితాలో 8 నుంచి 10వ స్థానాల్లో రెండు పాపులర్ వెబ్ సిరీస్‌లు, ఒక హిట్ టీవీ షో నిలిచాయి.

10వ స్థానం: జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఫాంటసీ డ్రామా సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3 పదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సిరీస్ మూడో సీజన్‌కు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

9వ స్థానం: రూపాలీ గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్‌హిట్ టీవీ సీరియల్ 'అనుపమ' డిజిటల్ వీక్షకులను ఆకట్టుకుంటూ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

8వ స్థానం: జియోహాట్‌స్టార్‌లోనే ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ 'థుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2 ఎనిమిదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికీ ఈ సిరీస్‌ను జనాలు విశేషంగా చూస్తున్నారు.

రష్మిక మూవీ ఏడో స్థానంలో..

జాబితాలో పైకి వెళ్లే కొద్దీ తీవ్ర పోటీ కనిపిస్తోంది. టాప్ 3కి చేరుకోలేకపోయినప్పటికీ మంచి వ్యూవర్‌షిప్ సాధించిన కంటెంట్ ఇక్కడ ఉంది. వీటిలో రష్మిక మందన్న నటించిన కాక్‌టెయిల్ 2 కూడా ఉంది.

7వ స్థానం: షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ కాంబినేషన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మల్టీస్టారర్ సినిమా 'కాక్‌టెయిల్ 2' ఏడో స్థానంలో నిలిచింది.

6వ స్థానం: సోనీ లివ్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ గేమ్‌షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) ఆరో స్థానాన్ని సాధించింది.

5వ స్థానం: థియేటర్లలో మంచి విజయం సాధించిన అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దిల్‌జీత్ దోసాంజ్ చిత్రం 'మై వాపస్ ఆవుంగా' ఐదో స్థానంలో నిలిచి డిజిటల్ ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది.

4వ స్థానం: యూట్యూబ్, సోనీ లివ్ వేదికలపై కోట్ల మంది వీక్షించే ప్రముఖ కామెడీ షో 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.

టాప్ 3లో నిలిచిన అసలైన విజేతలు

ఇక ఈ వారం ప్రేక్షకులను అత్యంత విశేషంగా ఆకట్టుకుని టాప్ 3లో నిలిచిన కంటెంట్ వివరాలు ఇవే..

3వ స్థానం: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఆసక్తికర టెస్టు మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు సోనీ లివ్‌లో భారీ ఎత్తున వీక్షించారు. దీంతో ఈ క్రీడా సమరం ఈ వారం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

2వ స్థానం: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రిప్పింగ్ కథనంతో రూపొందిన ఈ సిరీస్ కు డిజిటల్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది.

1వ స్థానం: రోహిత్ శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ స్టంట్ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' సీజన్ 15 ఈ వారం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఓటీటీ విజేతగా నిలిచింది. కంటెస్టెంట్ల థ్రిల్లింగ్ స్టంట్స్, రోహిత్ శెట్టి హోస్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More