OTT Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ.100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. అల్లు అర్జున్ డైరెక్టరే హీరో.. తెలుగులోనూ..

OTT Thriller: ఓటీటీలోకి ఈవారం వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటైన డీసీ మరికొన్ని గంటల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. అల్లు అర్జున్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Sep 3, 2026, 19:06:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Thriller: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' (DC) డిజిటల్ ప్రీమియర్‌కు రంగం సిద్ధమైపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, రేపటి నుంచే అంటే సెప్టెంబర్ 4 శుక్రవారం నుంచే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

OTT Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ.100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. అల్లు అర్జున్ డైరెక్టరే హీరో.. తెలుగులోనూ..
OTT Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ.100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. అల్లు అర్జున్ డైరెక్టరే హీరో.. తెలుగులోనూ..

హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ.. రా యాక్షన్ సబ్జెక్ట్

'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) క్రియేట్ చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మొదటిసారి స్క్రీన్ పైన ఫుల్ లెంగ్త్ హీరోగా మారి చేసిన ప్రాజెక్ట్ 'డీసీ'. 'రాకీ', 'సాని కాగితం', 'కెప్టెన్ మిల్లర్' వంటి రఫ్‌ అండ్ రా యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన విజనరీ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను చాలా ఇంటెన్స్‌గా డైరెక్ట్ చేశారు.

యాక్షన్ తో కూడిన ఎమోషనల్ సబ్జెక్ట్‌గా రూపొందిన ఈ సినిమాలో లోకేష్ తన నటనతో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. డైరెక్టర్‌గా కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న లోకేష్.. ఇప్పుడు స్క్రీన్ పైన నటుడిగా ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడటానికి ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఇదే లోకేష్ కనగరాజ్ మన అల్లు అర్జున్ తోనూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో డీసీ మూవీకి బన్నీ కూడా రివ్యూ ఇచ్చారు.

వామికా గబ్బి రొమాన్స్.. అనిరుధ్ మ్యూజిక్

ఈ డీసీ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ వామికా గబ్బి ఫీమేల్ లీడ్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

సినిమాటోగ్రఫీని ముకేష్ పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రసన్న చూసుకున్నారు. పీసీ స్టంట్స్ పర్యవేక్షణలో వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించాయి.

ఇంటి దగ్గరే ఆడియన్స్‌కు బెస్ట్ థియేట్రికల్ ఫీల్ అందించేందుకు సన్ నెక్ట్స్ యాజమాన్యం స్పెషల్ కేర్ తీసుకుంది. ఈ సినిమాను డాల్బీ విజన్ (Dolby Vision) విజువల్స్, డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ క్వాలిటీతో డిజిటల్ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా సొంత భాషలో ఈ క్రేజీ యాక్షన్ మూవీని ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. లోకేష్ కనగరాజ్ మాస్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ అండ్ అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ ఇవన్నీ కలిసి 'డీసీ' సినిమాను ఈ వీకెండ్ విపరీతంగా వాచ్ చేసే డిజిటల్ కంటెంట్‌గా మార్చేశాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More