...
...
Next Story

OTT Thriller: ఓటీటీలోకి తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Thriller: కోలీవుడ్ యాక్షన్ హీరో ఆర్య నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. మే 14 నుండి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ మూవీని చూడొచ్చు.

Published on: May 13, 2026, 21:14:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Thriller: కోలీవుడ్ విలక్షణ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్' (Mr. X) ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

OTT Thriller: ఓటీటీలోకి తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Thriller: ఓటీటీలోకి తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపటి నుంచే స్ట్రీమింగ్

తాజా సమాచారం ప్రకారం 'మిస్టర్ ఎక్స్' మూవీ రేపు అంటే గురువారం (మే 14) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (Jio Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ముఖ్యంగా స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఇప్పుడు తమ ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో పెద్దగా నోటీస్ కాని ఈ సినిమా.. డిజిటల్ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

భారీ తారాగణం.. గ్రిప్పింగ్ యాక్షన్

మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్యతో పాటు భారీ తారాగణం నటించింది. టాలెంటెడ్ యాక్టర్ గౌతమ్ కార్తీక్ మరో కీలక పాత్ర పోషించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్, మంజు వారియర్ ముఖ్యమైన పాత్రల్లో మెరిశారు. అతుల్య రవి, అనఘ, రైజా విల్సన్, జయప్రకాష్, కాళీ వెంకట్ వంటి నటీనటులు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు. ప్రిన్స్ పిక్చర్స్, మావెరిక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, వినీత్ జైన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మిస్టర్ ఎక్స్ సినిమా ఏ ఓటీటీలో విడుదల అవుతోంది?

ఈ సినిమా మే 14, 2026 నుండి జియోహాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మిస్టర్ ఎక్స్ సినిమా ఏయే భాషల్లో అందుబాటులో ఉంది?

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది.

మిస్టర్ ఎక్స్ సినిమాలో ప్రధాన నటులు ఎవరు?

ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అతుల్య రవి కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe