ఓజీ డైరెక్టర్కు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారు గిఫ్ట్గా ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఫొటోలు షేర్ చేసిన సుజీత్
ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్. తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందించిన డైరెక్టర్ కు పవన్ ఇలా థ్యాంక్స్ చెప్పాడు. ఆ ఫొటోలను సుజీత్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
పవన్ కల్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద ఓజీ రూపంలో వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపింది. దీంతో తనకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ పవర్ఫుల్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన ఖరీదైన బహుమతికి సంబంధించిన ఫొటోలను సుజీత్ మంగళవారం (డిసెంబర్ 16) ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
“జీవితంలో బెస్ట గిఫ్ట్ ఇది. మాటలకు అందని కృతజ్ఞతా భావంతో నిండిపోయాను. మా డియరెస్ట్ ఓజీ పవన్ కల్యాణ్ గారి నుంచి అందిన ప్రేమ, ప్రోత్సాహం వర్ణించలేనిది. చిన్నప్పుడు అభిమానిగా ఉన్నప్పటి నుంచీ ఇప్పుడీ ప్రత్యేక క్షణం వరకు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అనే క్యాప్షన్ తో సుజీత్ పోస్ట్ చేశాడు.
ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్
డైరెక్టర్ సుజీత్ కు పవన్ కల్యాణ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ కారుతోపాటు పవన్ కల్యాణ్ తో ఉన్న ఫొటోలను సుజీత్ షేర్ చేశాడు. ఇందులో సుజీత్ కోసం పవన్ కారు డోరు తెరవడం, ఆ తర్వాత కారులో కూర్చున్న సుజీత్ డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉండటం, తర్వాత కారు ముందు ఇద్దరూ కలిసి ఉండటం ఈ ఫొటోల్లో చూడొచ్చు.
ఓజీ మూవీ గురించి..
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ తోపాటు ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మిలాంటి వాళ్లు నటించారు. ఇదో గ్యాంగ్స్టర్ డ్రామా. ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.
ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్ను చూస్తారు. పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్ట్స్ లెవెల్లో ఉంది. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ. ప్రతి సీన్ పవన్ కల్యాణ్కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


