Peddi Box Office: 4 రోజుల్లో 236 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పెద్ది జోరు.. ఓవర్సీస్లో ఎంత వచ్చిందంటే?
Peddi 4 Days Box Office Collection: రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్ మూవీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫలితంగా నాలుగు రోజుల్లో పెద్ది సినిమా రూ. 236 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరి ఓవర్సీస్లో పెద్ది ఎన్ని కోట్లు వసూలు చేసింది, మిగతా బాక్సాఫీస్ లెక్కలపై లుక్కేద్దాం.
Peddi 4 Days Worldwide Box Office Collection: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. 'ఉప్పెన' చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సరికొత్త చిత్రం 'పెద్ది'.

అచ్చియమ్మ పాత్రపై వ్యతిరేకత
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ వివాదం ఇలా నడుస్తుండగానే, థియేటర్లలో మాత్రం 'పెద్ది' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే పెద్ది సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఆదివారం నాటి వసూళ్లలో కొంత వృద్ధి
బాక్సాఫీస్ ట్రాకర్ 'సాక్నిల్క్' నివేదిక ప్రకారం.. 'పెద్ది' చిత్రం నాలుగో రోజైన ఆదివారం (జూన్ 7) నాడు వసూళ్లలో కొంత వృద్ధిని కనబరిచింది. శనివారం నాడు వచ్చిన రూ. 31.88 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఆదివారం ఇండియాలో రూ. 31.90 నెట్ కలెక్షన్లు వచ్చాయి. అది కూడా 9,065 షోలతో ఈ వసూళ్లు వచ్చాయి.
ఓపెనింగ్ రోజే పెద్ది చిత్రం దేశీయంగా రూ. 51 కోట్ల నికర వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే మొదటి రోజు రూ. 20 కోట్లు రాబట్టడం, దాదాపు 82 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం రామ్ చరణ్ స్టార్ పవర్కు నిదర్శనం.
పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 స్క్రీన్లలో విడుదలైన పెద్ది సినిమా, నాలుగు రోజులు ముగిసేసరికి దేశీయంగా అంటే ఇండియాలో రూ. 186.69 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, రూ. 157.13 కోట్ల నెట్ (Net) వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్లో 4 రోజుల్లో రూ. 42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే.. వరల్డ్ వైడ్గా రూ. 236.07 కోట్ల గ్రాస్ వసూలు అయింది.
పెద్ది కథ ఏంటీ?
ఈ సినిమా టైటిల్ పాత్ర అయిన 'పెద్ది' (రామ్ చరణ్) అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. క్రీడల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అతను చేసే పోరాటమే ఈ చిత్రం.
క్రికెట్, కుస్తీ (రెజ్లింగ్), స్ప్రింటింగ్ (పరుగు పందెం) వంటి వివిధ క్రీడల్లో రాణించి, భారత ప్రభుత్వం దృష్టిని అతను ఎలా ఆకర్షించాడనే అంశాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు.
అసలు వివాదం ఎందుకు వచ్చింది?
సమాజానికి అవసరమైన ఒక మంచి సందేశాన్ని అందించినందుకు సినిమాపై ప్రశంసలు వస్తున్నప్పటికీ, జాన్వీ కపూర్ పాత్ర 'అచ్చియమ్మ'ను చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలను కేవలం గ్లామర్ వస్తువుగా మార్చేశారని, హీరోయిన్ను హైపర్సెక్సువలైజ్ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'పెద్ది' సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసింది?
'పెద్ది' చిత్రం తన మొదటి రోజున దేశీయంగా రూ. 51 కోట్ల నికర వసూళ్లను సాధించింది. కేవలం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమాకు రూ. 20 కోట్లు వచ్చాయి.
2. 'పెద్ది' సినిమా కథ దేని చుట్టూ తిరుగుతుంది?
ఈ సినిమా 'పెద్ది' అనే యువకుడి కథ. అతను క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి వివిధ క్రీడల ద్వారా తన గుర్తింపును ఎలా చాటుకున్నాడు, భారత ప్రభుత్వం చేత ఎలా గుర్తింపు పొందాడు అనే అంశాల చుట్టూ ఈ స్పోర్ట్స్ డ్రామా సాగుతుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


