...
...
Next Story

Prabhas: కల్కి సీక్వెల్‌కు అదిరే టైటిల్‌.. అదే నిజ‌మైతే గూస్ బంప్స్ ప‌క్కా.. క‌ర్ణుడిగా ప్ర‌భాస్ విశ్వరూపం!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న భారీ ప్రాజెక్టుల్లో కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు అదిరిపోయే టైటిల్ పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో కర్ణుడిగా ప్రభాస్ విశ్వరూపం చూపిస్తారని టాక్.

Published on: Apr 27, 2026, 11:33:59 IST
Advertisement

Prabhas: పాన్ ఇండియా సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ఒకటి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడీ సీక్వెల్ టైటిల్ పై ఓ క్రేజీ జబ్ వైరల్ గా మారింది. అలాగే మూవీలో ప్రభాస్ అదరగొడతారని అంటున్నారు.

కల్కి 2898 ఏడీ

కల్కిలో ప్రభాస్ (x/Kalki2898AD)
కల్కిలో ప్రభాస్ (x/Kalki2898AD)

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు.

సీక్వెల్ టైటిల్

బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ పవర్ ఫుల్ పేరు వైరల్ గా మారింది. అదే ‘కర్ణ 3102 బీసీ’. కల్కి 2కు కర్ణ 3102 బీసీ అనే పేరును మేకర్స్ ప్రకటించే అవకాశముందనే ప్రచారం తెగ జోరుగా సాగుతోంది.

ప్రభాస్ విశ్వ రూపం

కల్కి 2898 ఏడీ సీక్వెల్ లో కర్ణుడి పాత్ర చుట్టూ కథ సాగుతుందని సమాచారం. అందుకే కర్ణ 3102 బీసీ అనే పేరు పెట్టేందుకు మేకర్స్ మొగ్గు చూపుతున్నారని టాక్. కల్కి పార్ట్ 1లో కర్ణుడిగా ప్రభాస్ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపించాడు. కానీ పార్ట్ 2లో మాత్రం అరగంట సేపు కర్ణుడి క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లపై ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో హీరో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఫౌజీ, స్పిరిట్ సినిమాలతోనూ ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe