డిజాస్టర్ మూవీతోనూ చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు
ప్రభాస్ ఖాతాలో ది రాజా సాబ్ మూవీ రూపంలో మరో దారుణమైన డిజాస్టర్ పడింది. అయితే ఈ సినిమాతో అతడు మరో మెట్టు పైకి ఎక్కాడు. ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ఇది. అదేంటో ఇక్కడ తెలుసుకోండి.
బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కెరీర్లో మరో అదిపెద్ద డిజాస్టర్ ది రాజా సాబ్. హారర్ కామెడీగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని ప్రభాస్ కు ఓ రికార్డు సాధించిపెట్టింది.

ది రాజా సాబ్ బాక్సాఫీస్ కలెక్షన్లు
ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో ది రాజా సాబ్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైనా.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినా.. నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తానికి 14వ రోజు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. వీటిలో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.142.08 కోట్లు కాగా.. గ్రాస్ 167.65 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ లో వచ్చిన రూ.34 కోట్లు కలుపుకుంటే.. మొత్తంగా గ్రాస్ రూ.201.65 కోట్లకు చేరింది.
ప్రభాస్ అరుదైన రికార్డు
ది రాజా సాబ్ తో ప్రభాస్ ఖాతాలో మరో రూ.200 కోట్ల గ్రాస్ సినిమా చేరింది. ఇప్పటికే అతని ఖాతాలో ఈ ఘనత సాధించిన ఆరు సినిమాలు ఉండగా.. ది రాజా సాబ్ తో అది ఏడుకి చేరింది. మరే తెలుగు హీరోకి సాధ్యం కాని రికార్డు ఇది. అంతెందుకు అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు మూడేసి సినిమాలతో తర్వాత స్థానంలో ఉన్నారు.
ప్రభాస్ తొలిసారి బాహుబలి 1తో ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ కూడా ఈ రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటాయి. మధ్యలో రాధేశ్యామ్ మాత్రమే రూ.149 కోట్లతో ఈ మార్క్ కు దూరమైంది. ఇప్పుడు ది రాజా సాబ్ మరోసారి ఆ ఘనత సాధించింది. ఆ లెక్కన బాహుబలి నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒక్క సినిమా మినహాయించి ప్రభాస్ ప్రతి మూవీ రూ.200 కోట్లు దాటడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


