తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ప్రభాస్ టాప్ 7 సినిమాలు ఇవే.. ది రాజా సాబ్ కూడా..

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ మిక్స్‌డ్ రివ్యూలతోనూ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే అతని కెరీర్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సినిమాలు ఏవో చూడండి.

Published on: Jan 10, 2026, 14:49:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత అతని మార్కెట్ స్థాయి ఆకాశన్నంటింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రభాస్ కెరీర్ కాస్త ఒడిదుడుకులతో సాగుతోంది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడితే, మరికొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా విడుదలైన హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ ప్రభాస్ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడంలో వెనుకబడిందనే చెప్పాలి.

తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ప్రభాస్ టాప్ 7 సినిమాలు ఇవే.. ది రాజా సాబ్ కూడా..
తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ప్రభాస్ టాప్ 7 సినిమాలు ఇవే.. ది రాజా సాబ్ కూడా..

ప్రభాస్ టాప్ 7 సినిమాలు

ది రాజా సాబ్ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో తొలి రోజు రూ.45 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. అసలు ప్రభాస్ గత సినిమాలు తొలి రోజు ఎంత రాబట్టాయి? వాటితో పోలిస్తే ‘రాజా సాబ్’ ఎక్కడ నిలిచిందో ఒకసారి చూద్దాం.

బాహుబలి 2 (2017)

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దశ, దిశను మలుపు తిప్పిన సినిమా ఇది. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ఒక్క ప్రశ్న దేశం మొత్తాన్ని థియేటర్లకు రప్పించింది. రాజమౌళి అద్భుత సృష్టి అయిన ఈ మూవీ.. తొలిరోజు ఇండియాలో ఏకంగా రూ. 121 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ప్రభాస్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్.

కల్కి 2898 AD (2024)

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అద్భుత విజయం సాధించింది. కంటెంట్ పరంగా, వసూళ్ల పరంగా బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ చూపిన సినిమా ఇదే. ఇది తొలిరోజు రూ. 95 కోట్ల ఓపెనింగ్స్‌తో దుమ్మురేపింది.

సలార్ (2023)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన మాస్ విశ్వరూపాన్ని చూపించాడు. యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పించిన ఈ చిత్రం.. తొలిరోజు రూ. 90 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.

సాహో (2019)

బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘సాహో’పై ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. నెగిటివ్ టాక్‌లోనూ తొలిరోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఆదిపురుష్ (2023)

ప్రభాస్ కెరీర్‌లో అత్యంత వివాదాస్పద చిత్రంగా, ట్రోల్స్ బారిన పడిన సినిమాగా ‘ఆదిపురుష్’ నిలిచింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్స్, పాత్రల తీరుపై విమర్శలు వచ్చాయి. అయినా సరే, ప్రభాస్ క్రేజ్ వల్ల తొలిరోజు రూ. 86 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ది రాజా సాబ్ (2026)

ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్‌లో, హారర్ కామెడీ జానర్‌లో చూడటం ఫ్యాన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. కానీ బాక్సాఫీస్ నంబర్స్ మాత్రం ప్రభాస్ స్థాయికి తక్కువే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ హవా నడుస్తుండటం కూడా దీనికి ఒక కారణం. ఈ సినిమా తొలిరోజు రూ. 45 కోట్లతో సరిపెట్టుకుంది. ఇది రాధేశ్యామ్ కంటే ఎక్కువైనా.. సలార్, కల్కి, సాహోల కంటే చాలా తక్కువ.

రాధేశ్యామ్ (2022)

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం, కెమిస్ట్రీ పండకపోవడంతో కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఈ సినిమా తొలిరోజు కేవలం రూ. 43 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రస్తుత ‘రాజా సాబ్’ వసూళ్లు దీని కంటే మెరుగ్గా ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More