ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి క్రిస్మస్ స్పెషల్.. రాజే యువరాజే ప్రోమో రిలీజ్.. శాంటా క్లాజ్కు రెబల్ స్టార్ పూజ
ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి క్రిస్మస్ సర్ప్రైజ్ వచ్చింది. రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయడం విశేషం. శాంటా క్లాజ్ కు పూజ చేస్తూ కనిపించే రెబల్ స్టార్ తర్వాత చర్చిలో తన ప్రేమ కోసం వేడుకుంటూ ఉంటాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. మేకర్స్ మెల్లగా సినిమా ప్రమోషన్లను పెంచారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ వచ్చింది.

ది రాజా సాబ్ సాంగ్ ప్రోమో
ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు.
“మెర్రీ క్రిస్మస్ డార్లింగ్స్.. మా నుంచి ఓ చిన్న ఫెస్టివ్ ట్రీట్ రాజే యువరాజే ప్రోమో. 2026 సీజన్లో అతిపెద్ద బ్లాక్బస్టర్ ను తీసుకురాబోతోంది. అంతే” అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.
ఈ ప్రోమో మొదట్లోనే శాంటా క్లాజ్ కు ప్రభాస్ పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రేయసిని వెతుకుతూ చర్చిలోకి వెళ్తారు. మీ ప్రేమ కోసం తాను ప్రేయర్ చేస్తానని అక్కడి నన్ చెబుతుంది. తమన్ అందించిన మ్యూజిక్ డిఫరెంట్ ఫీల్ తో సాగిపోయింది. ఈ మధ్యే ఈ మూవీ నుంచి సహన సహన అనే సాంగ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
ది రాజా సాబ్ నుంచి రాజే యువరాజే ప్రోమో చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఒకరు, సూపర్ అని మరొకరు.. ఇప్పటి వరకూ రాజా సాబ్ నుంచి వచ్చిన వాటిలో బెస్ట్ అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ కూడా చెబితే బాగుండేది కదా అని ఓ అభిమాని అన్నారు. ప్రభాస్ చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కొందరు అంటున్నారు. ఇక ఈ పాటకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ను కూడా ప్రశంసిస్తూ కామెంట్స్ వస్తున్నాయి.
ది రాజా సాబ్ మూవీ గురించి..
మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీగా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంక్రాంతికి రానున్న తొలి సినిమా ఇదే కాగా.. మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


