370 Biryani Controversy: గీత దాటితే వాతే-370 బిర్యానీ వివాదం-దిగొచ్చిన ప్రణీత్ మోరె-ట్రోల్స్ దెబ్బకు సారీ-ఇదో వార్నింగ్

370 Biryani Controversy: స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరె దిగి వచ్చాడు. నెటిజన్ల దెబ్బకు సారీ అంటూ తలవంచాడు. తన షోలో ఒక ప్రేక్షకుడు మహిళల పట్ల చేసిన అసభ్య వ్యాఖ్యలను అడ్డుకోకుండా నవ్వినందుకు ప్రణీత్  తీవ్ర విమర్శలు, చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు.

Published on: Jun 13, 2026, 14:27:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

370 Biryani Controversy: సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీసిన ‘రూ.370 బిర్యానీ వివాదం’ (370 Biryani Row) పై స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే ఎట్టకేలకు మౌనం వీడాడు. తన షోలో ఒక ప్రేక్షకుడు మహిళల పట్ల చేసిన అసభ్యకర వ్యాఖ్యలను అడ్డుకోకుండా, నవ్వి ప్రోత్సహించినందుకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

370 బిర్యానీ వివాదం.. దిగొచ్చిన ప్రణీత్ మోరె
370 బిర్యానీ వివాదం.. దిగొచ్చిన ప్రణీత్ మోరె

క్రౌడ్ వర్క్ కల్చర్

రూ.370 బిర్యానీ వివాదం మొత్తం సోషల్ మీడియానే ఊపేసింది. దీని వల్ల వీడియోలు వైరల్ అవడమే కాదు, ఒకరి ఉద్యోగం కూడా పోయింది. అయితే కేవలం ఒక వైరల్ వీడియో క్లిప్ వల్ల ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరిపై సైబర్ క్రిమినల్ కేసులు నమోదు కావడం వెనుక ఉన్న ‘టాక్సిక్ క్రౌడ్‌వర్క్ కల్చర్’ ఏంటి? దీని వెనుక ఉన్న సామాజిక, చట్టపరమైన లెక్కల ఎడిటోరియల్ విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

ఇదో ఎగ్జాంపుల్

ఇటీవలి కాలంలో స్టాండప్ కమెడియన్లు ముందస్తుగా రాసుకున్న స్క్రిప్ట్ కంటే థియేటర్లలో ఉన్న ఆడియన్స్‌తో అప్పటికప్పుడు మాట్లాడే 'క్రౌడ్ వర్క్ (Crowd-work)' పద్ధతిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ తరహా వీడియోలకు వచ్చే మిలియన్ల కొద్దీ వ్యూస్.

కానీ, ఈ వ్యూస్ పిచ్చిలో కనీస విచక్షణను, మహిళల పట్ల గౌరవాన్ని ఎలా మరుస్తున్నారో చెప్పడానికి ఈ 'గురుగ్రామ్ స్టాండప్ కామెడీ వివాదం' ఒక పీక్ ఎగ్జాంపుల్.

తప్పు ఎక్కడ జరిగింది?

ప్రణీత్ మోరె తన క్షమాపణ వీడియోలో "అక్కడున్న వారంతా నవ్వడంతో నేను కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోయాను" అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఒక ప్రొఫెషనల్ కమెడియన్‌గా మైక్ చేతిలో ఉన్నప్పుడు హద్దులు దాటుతున్న ప్రేక్షకుడిని అక్కడే అడ్డుకునే బాధ్యత ఆయనకు ఉంది.

డేటింగ్‌లో అమ్మాయికి రూ.370 బిర్యానీ కొనిపెడితే ఆమెపై ఏదో శారీరక హక్కు వస్తుందనే రేంజ్‌లో సదరు ప్రేక్షకుడు మాట్లాడితే.. దాన్ని ఖండించాల్సింది పోయి, "Peak Gurgaon Content" అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ద్వారానే ప్రణీత్ తన చేజేతులా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నారు.

ఊడిన ఉద్యోగం

ఈ వివాదంలో కేవలం డిజిటల్ ట్రోలింగ్‌తోనే కథ ముగిసిపోలేదు. కార్పొరేట్ సంస్థలు, చట్టసభలు మహిళల పట్ల జరిగే ఇటువంటి క్యాజువల్ లైంగిక వేధింపుల ధోరణిపై ఎంత కఠినంగా ఉన్నాయో ఈ సంఘటనతో అర్థమైంది. అమ్మాయిల పట్ల వ్యాఖ్యలకు గాను హిమాన్షు ఉద్యోగం ఊడింది. ప్రణీత్ మోరెపై కేసులు నమోదయ్యాయి.

ఇదో వార్నింగ్

డిజిటల్ అల్గారిథమ్‌లను శాసించడానికి కమెడియన్లు షార్ట్‌కట్ వెతుకుతున్నారు. అయితే, కామెడీ పేరిట మహిళలపై జరిగే వేధింపులను, వారి అంగీకారం లేని ప్రవర్తనను కొనియాడితే చర్యలు తప్పవనేందుకు ఇదో హెచ్చరిక. చేతిలో మైక్ ఉంది కదా అనీ వ్యూస్ కోసం గీత దాటితే వాత తప్పదు.

People Also Ask (PAA) - తరచుగా అడిగే ప్రశ్నలు

1. రూ.370 బిర్యానీ వివాదం పూర్తి కథ ఏంటి?

జవాబు: గురుగ్రామ్‌లో జరిగిన ఒక కామెడీ షోలో హిమాన్షు జాంగ్రా అనే ప్రేక్షకుడు తాను ఒక అమ్మాయి బిర్యానీ కోసం రూ. 370 ఖర్చు చేశానని, అందుకు ప్రతిఫలంగా ఆమెను లైంగికంగా వాడుకునే హక్కు తనకు ఉందనేలా మహిళలను కించపరిచేలా మాట్లాడాడు.

2. హిమాన్షు జాంగ్రా జాబ్ పోయిందా?

జవాబు: వైరల్ వీడియోలో మహిళలపై ఆయన చేసిన అత్యంత అభ్యంతరకరమైన, లైంగిక వేధింపులను ప్రోత్సహించే వ్యాఖ్యల వల్ల ఆ కంపెనీ అంతర్గత నిబంధనలు (Code of Conduct) దెబ్బతినడంతో, ఆయన పనిచేస్తున్న సంస్థ హిమాన్షు జాంగ్రాను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించింది.

3. ప్రణీత్ మోరెపై కేసు నమోదైందా?

జవాబు: అవును, సోషల్ మీడియాలో అశ్లీలతను వ్యాప్తి చేయడం, మహిళలను కించపరిచే ధోరణిని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు కమెడియన్ ప్రణిత్ మోరే, ప్రేక్షకుడు హిమాన్షు జాంగ్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More