Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

Mahakali OTT: మహాకాళి మూవీ గ్లింప్స్ వీడియో కూడా బయటకు రాక ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.

Published on: Aug 24, 2026, 08:52:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahakali OTT: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' గ్లింప్స్ రిలీజ్ కాకముందే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈరోజు (ఆగస్టు 24) ఉదయం 11:34 గంటలకు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుండగా, ఆలోపే డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను మైండ్ బ్లాకింగ్ ధరకు దక్కించుకుంది. ప్రమోషన్లు పూర్తిస్థాయిలో మొదలుకాకముందే ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాకు ఈ స్థాయిలో డిజిటల్ డీల్ కుదరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్
Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

'హనుమాన్' సక్సెస్ ప్రభావం.. పీవీసీయు బ్రాండ్ వాల్యూ

'హనుమాన్' (Hanu-Man) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ప్రతీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ మైథాలజీకి సూపర్‌హీరో ఎలిమెంట్స్‌ను జోడించి ఆయన క్రియేట్ చేస్తున్న ఈ విజువల్ వండర్స్ పై గ్లోబల్ లెవెల్‌లో విపరీతమైన హైప్ నెలకొంది.

ఈ యూనివర్స్‌లో మొదటిసారిగా ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో 'మహాకాళి'ని రూపొందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ విజన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకంతోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ గ్లింప్స్ చూడకముందే ఫ్యాన్సీ రేట్‌ ఆఫర్ చేసి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.

అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ ఎంట్రీ.. పవర్ ఫుల్ కాస్టింగ్

ఈ సినిమాలో టైటిల్ రోల్ 'మహాకాళి'గా భూమి శెట్టి నటిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు ఈ చిత్రంతో దర్శకురాలిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ (RKD Studios) బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ అత్యంత భారీ బడ్జెట్‌తో, కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ వర్సటైల్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో 'శుక్రాచార్య' అనే పవర్ ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించనుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. అలాగే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రోహిత్ సరాఫ్ ఈ మూవీతోనే తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఖుష్బూ సుందర్, శ్రియ రెడ్డి, సముద్రఖని, రాజేష్ బేడి, రజత్ కపూర్, నాజర్, మురళీ శర్మ, పృథ్వీరాజ్ లాంటి దిగ్గజ తారలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాసేపట్లో ఫస్ట్ గ్లింప్స్.. సంక్రాంతి 2027 రేసులో..

సోమవారం (ఆగస్ట్ 24) ఉదయం 11:34 గంటలకు విడుదల కాబోయే ఫస్ట్ గ్లింప్స్‌లో 'మహాకాళి' విజువల్ వరల్డ్‌ను పరిచయం చేయబోతున్నారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా శుక్రాచార్య లుక్ ఎలా ఉండబోతోందనే దానిపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. స్మరణ్ సాయి అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ డ్రామాకు ప్రధాన బలంగా నిలవనుంది.

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషనల్ క్యాంపైన్ ప్రారంభంలోనే నెట్‌ఫ్లిక్స్ డీల్ క్లోజ్ అవ్వడంతో ‘మహాకాళి’ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More