Bunny Vas: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ల డిమాండ్లు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సినిమా ఓనర్లు న్యాయం చేయాలంటున్నారు. ఇన్ని రోజులూ రెంట్ విధానంలో సినిమాలు ఆడించామని, ఇకపై పర్సెంటేజీ కావాలంటున్నారు. దీనిపై పాపులర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు సంచలన పోస్టు పెట్టాడు.
బన్నీ వాసు పోస్ట్

అసలే ఆదాయం తగ్గిపోయిందని, వచ్చే పావలా వాటా కోసం కొట్టుకోవడం కరెక్ట్ కాదని బన్నీ వాసు తన పోస్టులో పేర్కొన్నాడు. బుధవారం (మే 13) ఎక్స్ లో బన్నీ వాసు పెట్టిన సుదీర్ఘ పోస్టు వైరల్ గా మారింది. ఇందులో మూల కారణం ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని వాసు రాసుకొచ్చాడు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు చెప్పాడు.
కలెక్షన్లు
‘‘పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు.. టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్కు రావడం తగ్గిపోయింది’’ అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.
తెలివి తక్కువ తనం
‘‘వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం’’ అని బన్నీ వాసు తన పోస్టులో తెలిపాడు.
నిర్మాతలకు నష్టం
‘‘ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా’’ అని వాసు ప్రశ్నించాడు.
ప్రధాన కారణాలు
{{/usCountry}}‘‘ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా’’ అని వాసు ప్రశ్నించాడు.
ప్రధాన కారణాలు
{{/usCountry}}‘‘నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి..
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు’’ అని బన్నీ వాసు పేర్కొన్నాడు.
ఏం లాభం?
‘‘ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలని వాదించుకుంటే ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు’’ అని బన్నీ వాసు తన పోస్టు ఎండ్ చేశాడు.