టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక కామెంట్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐడిల్బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమ సినిమాను తొక్కేయొద్దు అంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి నవీన్ పోలిశెట్టితో కలిసి అతడు తీసిన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు అతడు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
మా సినిమాను తొక్కేయొద్దనే అడుగుతున్నాం..

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడైన నాగవంశీ తాజాగా తన నెక్ట్స్ మూవీ అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో భాగంగా ఐడిల్బ్రెయిన్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మూవీ ఫెయిలవడంలో ఎవరిది తప్పు అని యాంకర్ అడిగినప్పుడు అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
“చాలా వరకు తప్పు మా దగ్గరే అంటే ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే జరుగుతాయి. కానీ కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమాలు ఉంటాయి కదా.. వాటిని తొక్కేయొద్దు అని మీడియాను అడుగుతున్నాం అంతే.. రెండు వీకెండ్స్ ఆరు రోజులు ఎడ్జ్ ఉంటే బయర్స్ కోణంలో సినిమాకు 70, 80 శాతం వరకు వెళ్లిపోతాం. ఆ ఎడ్జ్ ఇవ్వమనే అడుగుతున్నాం. సినిమా తప్పు వరకు చూస్తే అది మా దగ్గరే జరుగుతుంది. ఇంకెవరూ సినిమాను చంపలేరు. అవన్నీ తప్పు మాటలు. సినిమా హిట్ కావడం ఆడియెన్స్ చేతుల్లోనే ఉంది. కానీ కాస్త ఆడే సినిమాలను మాత్రం పుష్ చేయడం.. తొక్కేయొద్దు అని మాత్రమే అడుగుతున్నాం” అని నాగవంశీ అన్నాడు.
కింగ్డమ్ సీక్వెల్ లేనట్లే
ఇక విజయ్ దేవరకొండతో కలిసి కింగ్డమ్ మూవీ తీసి నాగవంశీ దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీకి ఇక సీక్వెల్ లేనట్లే అని కన్ఫమ్ చేశాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి మరో సినిమా చేస్తున్నాడని, ఆ తర్వాత అతనితో తాను ఇంకో మూవీ చేస్తానని స్పష్టం చేశాడు. కింగ్డమ్ ఎక్కడ మిస్ ఫైర్ అయిందో అర్థం కావడం లేదని చెప్పాడు.
ఇక ఇప్పుడు వస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కచ్చితంగా నవ్విస్తుందని మరోసారి నాగవంశీ తేల్చి చెప్పాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
{{/usCountry}}ఇక ఇప్పుడు వస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కచ్చితంగా నవ్విస్తుందని మరోసారి నాగవంశీ తేల్చి చెప్పాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
{{/usCountry}}