హైదరాబాద్ నడిబొడ్డున 8 కొత్త సినిమా స్క్రీన్లు.. సీటింగ్ కెపాసిటీ 1,402!
సినిమా లవర్స్కు గుడ్న్యూస్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మరో 8 కొత్త సినిమా స్క్రీన్లు ప్రారంభించారు. మెుత్తం 1402 సిటింగ్ కెపాసిటీతో ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ నగరంలో సినిమా అనగానే.. చాలా మందికి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు గుర్తుకువస్తుంది. ఇక్కడ సినిమా టాక్ ఆధారంగా మూవీ హిట్టా ఫట్టా డిసైడ్ అయిపోతారు. అలాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లలోని ఓడియన్ మాల్లో సరికొత్త పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని సినిమా లవర్స్కు మరింత ఊపునివ్వనుంది. కొత్తగా ప్రారంభించిన ఈ 8 స్క్రీన్లలో మొత్తం 1,402 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. సిటీలో ఎంటర్టైన్మెంట్కు మరో అడ్డగా తయారుకానుంది.

ఈ తాజా ప్రారంభంతో హైదరాబాద్లో 19వ పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభమైనట్టు. దీనితో నగరంలో ఐనాక్స్ మొత్తం స్క్రీన్ల సంఖ్య 119కి చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి ఓడియన్ మాల్లో పీవీఆర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రీమియం వ్యూ అనుభవం కోసం రూపొందించిన ఈ మల్టీప్లెక్స్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎనిమిది స్క్రీన్లు ఉన్నాయి.
రెండు 4K ప్రొజెక్టర్లు, లేజర్ ఫాస్ఫర్ ప్రొజెక్టర్తో సహా అధునాతన ప్రొజెక్షన్ వ్యవస్థలతో అమర్చారు. అత్యుత్తమ బ్రైట్నెస్, స్పష్టతను అందిస్తుంది. డాల్బీ అట్మాస్, DTS:X, నెక్స్ట్-జెన్ 3D టెక్నాలజీ ధ్వని, దృశ్యాలతో అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. కొత్తగా ప్రారంభించిన వాటితో పీవీఆర్ ఐనాక్స్ నెట్వర్క్ను భారతదేశం, శ్రీలంక అంతటా 1,791 స్క్రీన్లకు విస్తరించింది.
ఓడియన్ మాల్లో ఈ స్క్రీన్లతోపాటుగా రాబోయే గేమింగ్ జోన్ మొత్తం అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీలు, యూత్కు వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్.. భారతదేశంలోని అత్యంత సినిమా మక్కువ ఉన్న మార్కెట్లలో ఒకటి అని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లి చెప్పారు.

E-Paper












