సినిమాల్లో ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం చాలాకాలంగా వస్తున్నదే. అయితే ఇది కేవలం సౌత్ సినిమాలకే కాదు.. బాలీవుడ్ లోనూ ఉందని రాశీ ఖన్నా అంటోంది. జూమ్కి తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లను కేవలం ఎక్స్పోజింగ్ కు మాత్రమే పరిమితం చేసే పాత్రలపై స్పందించింది.
రాశీ ఖన్నా ఏమన్నదంటే?

సౌత్ ఇండియా సినిమాలలో మహిళల చిత్రీకరణ గురించి రాశీ ఖన్నా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. "ఇది కేవలం సౌత్ కు పరిమితమైనది మాత్రమే కాదు. నేను దీన్ని నార్త్లో కూడా చాలా చూస్తున్నాను. ఇది పూర్తిగా ఆయా నటుల ఛాయిస్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి దానితో ఇబ్బంది ఉండదు. మరికొందరికి ఉంటుంది" అని ఆమె అభిప్రాయపడింది.
"నేను సౌత్లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. కాబట్టి ఇప్పుడు హిందీలో ఒక అడుగు ముందుకు వేసి కంటెంట్ ఆధారిత పాత్రలలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. కమర్షియల్ అంశాలను చేయడానికి నాకు ఓకే. కానీ నాకు కూడా ఒక పరిమితి ఉంది. ప్రతి యాక్టర్ పరిమితి వేరుగా ఉంటుంది, అదే వారు ఎవరనేది చెబుతుంది" అని రాశీ చెప్పింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. "నేను చేస్తున్న దానితో నేను సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఒక హద్దు దాటుతుందని, అందులో నేను చీప్ గా కనిపిస్తానని నేను భావిస్తే దానికి 'నో' చెప్తాను. ప్రతి యాక్టర్ కి వేరే కంఫర్ట్ జోన్ ఉంటుంది. నేను ఎవరినీ జడ్జ్ చేయను" అని స్పష్టం చేసింది.
రాశీ ఖన్నా కెరీర్ ఇలా..
రాశీ ఖన్నా తెలుగులో చాలా సినిమాలే చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవుతోంది. '120 బహదూర్' అనే హిస్టారికల్ వార్ ఫిల్మ్లో రాశీ ఖన్నా తాజాగా కనిపించింది. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ మేజర్ షైతాన్ సింగ్ పాత్రలో, రాశీ ఖన్నా ఆయన భార్య షగుణ్ కన్వర్ పాత్రలో నటించారు. వివియన్ భతేనా, అంకిత్ సివాచ్ సహాయక పాత్రల్లో నటించారు.
{{/usCountry}}రాశీ ఖన్నా తెలుగులో చాలా సినిమాలే చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవుతోంది. '120 బహదూర్' అనే హిస్టారికల్ వార్ ఫిల్మ్లో రాశీ ఖన్నా తాజాగా కనిపించింది. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ మేజర్ షైతాన్ సింగ్ పాత్రలో, రాశీ ఖన్నా ఆయన భార్య షగుణ్ కన్వర్ పాత్రలో నటించారు. వివియన్ భతేనా, అంకిత్ సివాచ్ సహాయక పాత్రల్లో నటించారు.
{{/usCountry}}ఈ సినిమా 1962 నవంబర్ 18న జరిగిన చైనా-భారత్ యుద్ధంలో ప్రధాన సంఘటనలలో ఒకటిగా పరిగణించే రెజాంగ్ లా యుద్ధం కథను చూపిస్తుంది. ఈ యుద్ధంలో కేవలం ఛార్లీ కంపెనీ13 కుమవోన్ రెజిమెంట్కు చెందిన 120 మంది భారతీయ సైనికులు.. 3,000 మంది బలమైన చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఈ పోరాటంలో చైనా వైపు 1,300 కంటే ఎక్కువ మంది మరణించినట్లు అంచనా. ఈ సినిమా విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుని, ఇప్పటి వరకు దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు వసూలు చేసింది.
రాశీ ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, శ్రీలీలతో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఏప్రిల్ 2026లో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా షాహిద్ కపూర్తో కలిసి నటించిన ‘ఫర్జీ సీజన్ 2’ వెబ్ సిరీస్ కూడా ఆమె లైన్లో ఉంది. దీని చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.