Rajinikanth Vijay: విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్షన్ వైరల్.. స్మైల్ ఇస్తూ అలా వెళ్లి..

Rajinikanth Vijay: తమిళనాడులో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఆయనను ప్రశ్నించినప్పుడు ఏమీ మాట్లాడకుండా కేవలం ఓ చిరు నవ్వు నవ్వి వెళ్లిపోవడం గమనార్హం.

Published on: May 12, 2026, 18:52:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajinikanth Vijay: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) ఆధిపత్యానికి తెరదించుతూ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం (మే 10) చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. దీనిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

Rajinikanth Vijay: విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్షన్ వైరల్.. స్మైల్ ఇస్తూ అలా వెళ్లి..
Rajinikanth Vijay: విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్షన్ వైరల్.. స్మైల్ ఇస్తూ అలా వెళ్లి..

రజనీకాంత్ మౌనం.. నెట్టింట చర్చలు

ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. మంగళవారం (మే 12) చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మీడియా ప్రతినిధులు పలకరించారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. రజనీకాంత్ కేవలం చిరునవ్వు చిందించి, చేతులు జోడించి ముందుకు సాగిపోయారు.

ఎటువంటి కామెంట్స్ చేయకుండానే ఆయన వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది. అయితే మే 4న ఫలితాలు విడుదలైన రోజే విజయ్‌కు రజనీకాంత్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

చారిత్రక విజయం.. రాజకీయ ప్రకంపనలు

తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, ఊహించని రీతిలో 108 స్థానాలను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, మిత్రపక్షాలతో కలిపి విజయ్ 120 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్‌కు సమర్పించారు. దీనితో ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటుల సరసన విజయ్ కూడా 'నటుడి నుంచి ముఖ్యమంత్రిగా' ఎదిగిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

సినీ ప్రముఖుల ప్రశంసలు

విజయ్ సాధించిన ఈ అద్భుత విజయంపై సౌత్ ఇండియా సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"సినిమా ఎంతటి పవర్ ఫుల్ అనేది ఈ రోజు నిరూపితమైంది. ఇది కేవలం హైప్ కాదు, నిజమైన అధికారం. ముఖ్యమంత్రి విజయ్ సార్‌కు నా హృదయపూర్వక అభినందనలు," అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

దర్శకుడు సిబి సత్యరాజ్ స్పందిస్తూ.. "జోసెఫ్ విజయ్ అను నేను! చరిత్ర సృష్టించిన మన ముఖ్యమంత్రి విజయ్ అన్నకు అభినందనలు," అని ట్వీట్ చేశారు.

రజనీకాంత్ తదుపరి సినిమాలు

రాజకీయాలకు స్వస్తి పలికిన రజనీకాంత్ ప్రస్తుతం తన సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చివరిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' మూవీలో కనిపించిన ఆయన.. త్వరలోనే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' షూటింగ్‌లో పాల్గొననున్నారు.

ఇందులో మళ్ళీ 'టైగర్' ముత్తువేల్ పాండియన్‌గా ఆయన రచ్చ చేయబోతున్నారు. వీటితో పాటు కమల్ హాసన్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సొంతంగా 108 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపి మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టింది.

2. విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?

మే 10, 2026 ఆదివారం రోజున చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

3. రజనీకాంత్ ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు?

రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2', కమల్ హాసన్‌తో కలిసి ఒక భారీ ప్రాజెక్టులో నటించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More