Ram Charan Injury: గాయంతోనే పెద్ది షూటింగ్కు రామ్ చరణ్.. కంటిపైన బ్యాండేజ్తోనే అభిమానులతో సెల్ఫీ వీడియో
Ram Charan Injury: పెద్ది షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్ మరుసటి రోజే మళ్లీ సెట్స్ కు వచ్చాడు. అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ సమయంలో అతని ఎడమ కంటిపై బ్యాండేజీ కనిపించింది.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తీస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' షూటింగ్లో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గాయమైందన్న వార్త మనందరికీ తెలిసిందే. ఆ గాయానికి ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది. అయినా సరే అతడు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా గురువారం (మార్చి 26) మళ్లీ సెట్స్లో అడుగుపెట్టాడు. ముఖ్యంగా తన బర్త్డే సందర్భంగా, కంటి పైన బ్యాండేజ్తోనే తనను కలవడానికి వచ్చిన అభిమానులను కలిసి వాళ్లలో ఫుల్ జోష్ నింపాడు. మరోవైపు తన అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని ఒక రిపోర్టర్ సడెన్గా చెప్పడంతో నిహారిక కొణిదెల ఒక్కసారిగా షాక్ అయింది.

ఫ్యాన్స్తో రామ్ చరణ్ సెల్ఫీ వీడియో..
రామ్ చరణ్ టీమ్ రీసెంట్గా ప్రెస్తో ఒక వీడియో షేర్ చేసింది. అందులో చరణ్ తన ట్రేడ్మార్క్ అయ్యప్ప మాల దీక్షలో, నల్లటి దుస్తులు, రుద్రాక్షలు ధరించి, జుట్టును ముడివేసుకుని కనిపించాడు. కంటి పైన బ్యాండేజ్ ఉన్నప్పటికీ అతడు ముఖంలో ఎలాంటి ఇబ్బందీ కనిపించలేదు. ఫ్యాన్స్ అంతా అతన్ని చూసి అరుస్తుంటే.. చరణ్ వాళ్లతో కలిసి చాలా ఉత్సాహంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతని దగ్గరికి దూసుకొస్తున్న అభిమానులను కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కాస్త కష్టపడాల్సి వచ్చింది.
చరణ్ను కలిసిన అభిమానులు కూడా తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెట్స్లో ఫ్యాన్స్ కోసం ఒక టెంట్ కూడా వేశారని చెబుతూ, నా కల నెరవేరింది అని ఒక అభిమాని ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చరణ్ కారులోంచి దిగి, లుంగీ పైకి కట్టి ఫ్యాన్స్ ఉన్న టెంట్ వైపు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 27న 41వ వసంతంలోకి అడుగుపెడుతున్న చరణ్కు బర్త్డే విషెస్ చెప్పడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడ క్యూ కట్టారు.
అసలు చరణ్కు గాయం ఎలా జరిగిందంటే..
పెద్ది షూటింగ్లో ఒక యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు చరణ్కు గాయమైందని, నాలుగు కుట్లు పడ్డాయని అతని టీమ్ బుధవారం హిందుస్థాన్ టైమ్స్కు కన్ఫర్మ్ చేసింది. అంత గాయమైనా కూడా అతడు బ్రేక్ తీసుకోకుండా వర్క్ కంటిన్యూ చేశాడు. కంటికి తీవ్రమైన గాయమైంది అంటూ వస్తున్న రూమర్స్లో ఎలాంటి నిజం లేదని, కన్ను సేఫ్గానే ఉందని వాళ్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే తిరుపతిలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో నిహారిక కొణిదెల ఈ విషయం తెలిసి బాగా కంగారు పడిపోయింది. పెద్ది సెట్స్లో చరణ్కు యాక్సిడెంట్ అయిందని ఒక రిపోర్టర్ అడగగానే.. "సార్, ఇలా ఇంత షాకింగ్గా చెప్తారా సార్? నేను ఫ్లైట్ దిగి పరుగెత్తుకుంటూ వచ్చాను, కనీసం ఫోన్ కూడా చూసుకోలేదు" అంటూ ఆమె ఆ క్షణంలో చాలా ఎమోషనల్ అయింది.
డాక్టర్కు థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి..
బుధవారం సాయంత్రం పెద్ది టీమ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ, చరణ్ ఎడమ కంటికి చిన్న గాయమైందని కన్ఫర్మ్ చేసింది. ఇక గురువారం మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ డాక్టర్కు థ్యాంక్స్ చెప్పాడు.
"డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో చేసిన స్కిల్ఫుల్ సర్జరీ నిజంగా మాకు పెద్ద రిలీఫ్. మేం కంగారు పడిన ఆ క్షణంలో మీ కేర్, ఎక్స్పర్టైజ్ మమ్మల్ని పూర్తిగా కుదుటపరిచాయి. మీ నైపుణ్యం వల్లే అంతా సెట్ అయింది, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని చిరంజీవి పోస్ట్ చేశాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


