Ram Charan: పెద్ది కథ ఆ గిరిజన అనామకుడి గురించే.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. స్టోరీ లీక్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై సరికొత్త అప్డేట్. ఈ సినిమా కథ ఒక గిరిజన యువకుడి చుట్టూ తిరుగుతుందని స్టోరీని చరణ్ లీక్ చేశాడు. అతని సంచలన కామెంట్లు వైరల్ గా మారాయి.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీ ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది స్టోరీ గురించి తాజాగా చరణ్ చేసిన సంచలన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

పెద్ది స్టోరీ
ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, దీని వెనుక అత్యంత బలమైన భావోద్వేగపూరితమైన సామాజిక కోణం ఉందని చెర్రీ స్పష్టం చేశాడు.
ఆ వ్యక్తి గురించి
తాజాగా పెద్ది ప్రమోషన్లలో భాగంగా బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మతో కలిసి రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో పెద్ది స్టోరీ గురించి చెర్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
"ఈ 'పెద్ది' కథ ఒక గిరిజన వ్యక్తి గురించి ఉంటుంది. ఈ సమాజంలో అసలు అతను ఉన్నాడనే గుర్తింపే లేదు. అతనికి ఓటు హక్కు లేదు, వెళ్ళడానికి సరైన రవాణా సౌకర్యం లేదు. జబ్బు చేస్తే ఆసుపత్రి లేదు. చదువుకోవడానికి బడి లేదు. అతను కేవలం ఒక అనామకుడు మాత్రమే!" అని రామ్ చరణ్ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఆ పోరాటమే
బాహ్య ప్రపంచానికి ఏమాత్రం తెలియని, ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోని ఒక గిరిజన యువకుడు సమాజంలో తన ఉనికిని చాటుకోవడానికి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఈ చిత్రమని చరణ్ మాటలను బట్టి స్పష్టమవుతోంది. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, ప్రభుత్వ సౌకర్యాలు అందక వారు పడే బాధలు తెలుగు సమాజానికి కొత్తవేమీ కావు.
దేశం గర్వించేలా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయి. బుచ్చిబాబు సాన ఈ యదార్థ పరిస్థితులకు క్రీడా నేపధ్యాన్ని జోడించి పెద్ది కథను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సమాజం దృష్టిలో అనామకుడైన ఒక సామాన్యుడు, ఆటల ద్వారా దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడనే పాయింట్ చుట్టూనే సినిమా తిరగనుంది.
చరణ్ కష్టం
పెద్ది లో క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఒకే సినిమాలో భిన్నమైన శరీర ఆకృతుల్లో కనిపించడానికి ఆయన మూడు రకాల శారీరక మార్పులు చేసుకున్నాడు. కథలో భాగంగా క్రికెటర్, రన్నర్, అలాగే రెజ్లర్ పాత్రల కోసం లీన్ లుక్ నుండి అత్యంత భారీ కాయం వరకు తన శరీరాన్ని మార్చుకున్నాడు.
ఈ శారీరక శ్రమ వల్ల షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా కండరాల నొప్పులతో బాధపడుతున్నానని, కనీసం తన కూతురు క్లిన్ కారాను ఎత్తుకోవడానికి కూడా చేతులు సహకరించడం లేదని చరణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
రిలీజ్ డేట్
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పాన్-ఇండియా పెద్ది చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం యాక్షన్, స్పోర్ట్స్ అంశాలే కాకుండా, సమాజంలో అణచివేతకు గురైన ఒక వర్గం తాలూకు ఆవేదనను, ఆత్మగౌరవ పోరాటాన్ని ‘పెద్ది’ రూపంలో వెండితెరపై చూపించబోతున్నారు. జూన్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం మెగా అభిమానులకే కాకుండా, ప్రతి ఒక్క సినీ ప్రేమికుడి గుండెను తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథ దేని గురించి?
జవాబు: ఇది మారుమూల ప్రాంతానికి చెందిన, ఎలాంటి కనీస వసతులు లేని ఒక గిరిజన యువకుడి కథ.
ప్రశ్న: 'పెద్ది' సినిమా దర్శకుడు ఎవరు? ఇది ఎప్పుడు విడుదలవుతోంది?
జవాబు: ఈ చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రశ్న: ఈ చిత్రం కోసం రామ్ చరణ్ ఎలాంటి శారీరక మార్పులు చేసుకున్నారు?
జవాబు: రామ్ చరణ్ ఈ సినిమా కోసం మూడు భిన్నమైన లుక్స్ కోసం శ్రమించారు. కథ డిమాండ్ మేరకు క్రికెటర్, రన్నర్, మల్లయోధుడి (రెజ్లర్) పాత్రల కోసం తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


