Ram Charan: నేను ప్రధాని మోదీని కలిసినప్పుడు పెద్ది స్టోరీ అడిగారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చెప్పారు.. ఇదీ అలాంటిదే: చరణ్
Ram Charan: రామ్ చరణ్ పెద్ది మూవీ ప్రమోషన్లలో భాగంగా తాను ప్రధాని మోదీని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆ సందర్భంలో మోదీ వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ ఫుట్బాలర్ గురించి చెప్పిన స్టోరీని కూడా మీడియాతో పంచుకున్నారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ని కలిసినప్పుడు ‘పెద్ది’ సినిమా గురించి జరిగిన సంభాషణను, దానికి సంబంధించిన ఒక రియల్ లైఫ్ స్ఫూర్తిదాయకమైన కథను చరణ్ ఈ వేదికపై వివరించారు.
'వికసిత్ భారత్' కాన్సెప్ట్తో 'పెద్ది'..
ఢిల్లీ ప్రెస్ మీట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. "నేను ఢిల్లీలో మోదీ సార్ని కలిసినప్పుడు, ఆయన నన్ను ‘పెద్ది’ సినిమా కథేంటి? దేని గురించి అని అడిగారు. ఈ సినిమా ‘వికసిత్ భారత్’ (Viksit Bharat), అంటే గ్రామీణ ప్రాంతాల సాధికారత, పల్లెల అభివృద్ధి చుట్టూ తిరుగుతుందని చెప్పాను. అది వినగానే ఆయన ఎంతో సంతోషించారు" అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ గ్రామం కథను పంచుకున్న ప్రధాని
రామ్ చరణ్ మాటలు విన్నాక, ప్రధాని మోదీ తన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఎదురైన ఒక అద్భుతమైన, నిజ జీవిత అనుభవాన్ని చరణ్తో పంచుకున్నారట.
"పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామానికి ప్రచారానికి వెళ్లినప్పుడు, అక్కడ చాలా మంది యువకులు ఫుట్బాల్ జెర్సీలు వేసుకుని తిరగడం చూశాను. దాని గురించి అడగ్గా.. ఆ ప్రాంతానికి చెందిన ‘మహమ్మద్’ అనే వ్యక్తి గతంలో భారత ఫుట్బాల్ జట్టుకు ఆడాడని తెలిసింది. అతని ఆటను, విజయాన్ని చూసి స్ఫూర్తి పొంది ఈరోజు ఆ ఒక్క చిన్న పల్లెటూరు నుండి ఏకంగా 85 మందికి పైగా యువకులు ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడుతున్నారు. సమాజంలో ఒకే ఒక్క వ్యక్తి ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకురాగలడో చెప్పడానికి ఇదొక నిదర్శనం" అని మోదీ చెప్పారట.
ఈ కథను ‘పెద్ది’ సినిమాకు కనెక్ట్ చేస్తూ.. "సమాజంలో ఒక్కరు అనుకుంటే ఎంతటి మార్పు వస్తుందో మోదీ గారు చెప్పారు. మా ‘పెద్ది’ సినిమా కూడా సరిగ్గా అలాంటి కథే. ఒక గిరిజన ప్రాంతానికి చెందిన ఒకే ఒక్క వ్యక్తి తన సమాజంలో, తన ప్రజల జీవితాల్లో ఎలాంటి పెద్ద మార్పును తీసుకువచ్చాడు అనే పాయింట్ మీదే ఈ సినిమా తెరకెక్కింది" అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'పెద్ది' సినిమా దేని గురించి అని రామ్ చరణ్ ప్రధాని మోదీకి చెప్పారు?
ఈ సినిమా 'వికసిత్ భారత్' కాన్సెప్ట్, అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సాధికారత నేపథ్యంలో సాగుతుందని చరణ్ ప్రధానికి వివరించారు.
2. ప్రధాని మోదీ రామ్ చరణ్తో పంచుకున్న ఫుట్బాల్ కథ ఏ ప్రాంతానికి చెందినది?
అది పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన కథ. అక్కడ మహమ్మద్ అనే ప్లేయర్ స్ఫూర్తితో 85 మందికి పైగా యువకులు ఫుట్బాల్ క్రీడాకారులుగా మారారు.
3. 'పెద్ది' సినిమా ఎప్పుడు, ఏ భాషల్లో విడుదల కానుంది?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం జూన్ 4, 2026న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


