Sreeja Konidela: నేను పడిన బాధలే నా గుర్తింపు కాదు.. బాధితురాలి ముద్ర నుంచి బయటపడ్డాను: రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ
Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి కూతురు, రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి రీసెంట్గా ఓపెన్ అయ్యారు. ఇన్ని రోజులు తన ఐడెంటిటీ మొత్తం తన గతంలో జరిగిన చేదు అనుభవాల చుట్టూనే తిరిగిందని ఆమె ఒప్పుకున్నారు.
Sreeja Konidela: చిరంజీవి కూతురు శ్రీజ సోమవారం (జూన్ 8) తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. అందులో తన గతం గురించి ఓపెన్ గా మాట్లాడారు. తాను అనుభవించిన కష్టాలు, వాటి ద్వారానే తనకు వచ్చిన గుర్తింపుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె ఏమన్నదో చూడండి.

బాధితురాలిని కాను
చిరంజీవి కూతురిగా, రామ్ చరణ్ చెల్లెలిగా శ్రీజ కొణిదెల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే చాలా వరకు నెగటివ్ వార్తలతోనే ఆమె ముడిపడి ఉంది. దీనిపైనా తాజా వీడియోలో శ్రీజ స్పందించారు.
"నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఇంత బాధ ఎందుకు అనుభవించాలి? ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం ఎందుకు వస్తోంది? అసలు ఈ కష్టాలు పడటానికి నేను చేసిన తప్పు ఏంటి? అనే ప్రశ్నల్లో నేను చాలా కాలం ఇరుక్కుపోయాను. కానీ ఈ ప్రయాణంలో నేను ఆ బాధితురాలిని అనే భావన నుంచి బయటకు వచ్చాను. లైఫ్ అంటే మనకు ఏదో జరిగిపోవడం కాదు, మన లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకునే పవర్ మనకు ఉందని అర్థమైంది" అని శ్రీజ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఎక్కువ భాగం బాధ, గతం, కష్టాలతోనే ముడిపడి ఉందని శ్రీజ ఫీల్ అయ్యారు. "నా లైఫ్ లో జరిగిన తప్పులే నా గుర్తింపును డిసైడ్ చేశాయని అనుకున్నాను. కానీ 'సేక్రెడ్ పాత్స్' (Sacred Paths) వాళ్లు కండక్ట్ చేసిన 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' ద్వారా నా ఆలోచనా విధానం పూర్తిగా మారింది. నా బాధ నాలో ఒక భాగమే కావచ్చు.. కానీ నా జీవితం అంతా అదే కాదు. ఒక మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోవడమే నా ఈ జర్నీలో దొరికిన మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్" అని ఆమె వివరించారు.
శ్రీజ గతం ఇలా..
2007లో కేవలం 19 ఏళ్ల వయసులో శ్రీజ తన 22 ఏళ్ల బాయ్ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్తో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు ఉండటంతో.. ఈ కపుల్ మీడియా, పోలీసుల రక్షణ కూడా అడిగారు. అప్పట్లో హైదరాబాద్ ఆర్యసమాజ్ లో జరిగిన వీళ్ల పెళ్లి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
2008 లో వీరికి నివృతి భరద్వాజ్ పుట్టింది. ఆ తర్వాత 2011 లో శిరీష్, అతని ఫ్యామిలీ మెంబర్స్ పై శ్రీజ కట్నం, గృహహింస వేధింపుల కేసు పెట్టారు. పుట్టింటికి తిరిగి వచ్చేసిన శ్రీజకు 2014 లో అఫీషియల్ గా విడాకులు వచ్చాయి. కాగా హెల్త్ ఇష్యూస్ వల్ల శిరీష్ భరద్వాజ్ 2024 లో హైదరాబాద్ లో చనిపోయారు.
ఆ తర్వాత 2016లో శ్రీజ తన చిన్ననాటి ఫ్రెండ్, బిజినెస్మెన్ కల్యాణ్ దేవ్ను రెండో పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి నవిష్క పుట్టింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2022లో ఈ జంట విడిపోయారు. శ్రీజ తన పేరు చివర ఉన్న 'కల్యాణ్' ను సోషల్ మీడియాలో తీసేయడంతో ఫ్యాన్స్ కు ఈ విషయం తెలిసింది. 2023 లో కల్యాణ్ దేవ్ కూడా తాము విడిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురితో గడిపే ఛాన్స్ తనకు దొరుకుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా ఫ్యామిలీ ఇతర వివరాలు చూస్తే.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల 2006లో బిజినెస్మెన్ ఎల్వీ విష్ణు ప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సమర, సంహిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ల పేర్లు క్లిన్ కారా, అన్వీర దేవి, శివరామ్.
తరచుగా అడిగే ప్రశ్నలు (PAA - People Also Ask)
ప్రశ్న 1: శ్రీజ కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఏ విషయాలు చెప్పారు?
సమాధానం: తన పాస్ట్ లైఫ్ లో జరిగిన స్ట్రగుల్స్, విక్టిమ్ మైండ్సెట్ (తాను ఒక బాధితురాలిని అనే ఫీలింగ్) నుంచి 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' అనే 15 నెలల కోర్సు ద్వారా ఎలా బయటపడ్డాననే విషయాలను శ్రీజ షేర్ చేసుకున్నారు.
ప్రశ్న 2: శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఎలా చనిపోయారు?
సమాధానం: హెల్త్ ఇష్యూస్ (అనారోగ్య సమస్యల) కారణంగా శిరీష్ భరద్వాజ్ 2024 లో హైదరాబాద్ లో చనిపోయారు.
ప్రశ్న 3: కల్యాణ్ దేవ్ తో శ్రీజకు ఉన్న పిల్లలు ఎవరు?
సమాధానం: శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులకు 2018 లో 'నవిష్క' అనే కూతురు పుట్టింది.
ప్రశ్న 4: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఎంతమంది పిల్లలు?
సమాధానం: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లిన్ కారా, అన్వీర దేవి, శివరామ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


