...
...
Next Story

ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడో సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ చిదంబరం డైరెక్ట్ చేసిన సినిమా కావడం విశేషం. ఆ మూవీ విశేషాలేంటో చూద్దాం.

Published on: Feb 12, 2026, 16:21:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు చిదంబరం నెక్ట్స్ మూవీ 'బాలన్' (Balan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రషెస్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ).. ఇది ఇండస్ట్రీని కుదిపేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అతడు ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో చూడండి.

"ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.."

ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు
ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు

2024లో 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన దర్శకుడు చిదంబరం. అతని దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా 'బాలన్' (Balan). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల చిదంబరాన్ని కలిసిన వర్మ.. 'బాలన్' సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్‌ను చూశారట. ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. "మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంతో నేను.. అతడు తీస్తున్న 'బాలన్' క్లిప్ చూశాను. ఇది అద్భుతం అనే మాట కంటే ఎక్కువే అని చెప్పాలి. ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది," అని ఆకాశానికెత్తేశాడు.

భారీ అంచనాలు.. ఆవేశం రైటర్ మ్యాజిక్

చిదంబరం డైెరెక్ట్ చేస్తున్న ఈ బాలన్ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం దీని రచయిత. బ్లాక్ బస్టర్ హిట్ 'ఆవేశం' (Aavesham) దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. డిసెంబర్ 2025లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 2026 ప్రథమార్ధంలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

బాలన్ మూవీ విశేషాలు

ఈ బాలన్ డైరెక్టర్ చిదంబరం గత సినిమాలు అయిన 'మంజుమ్మెల్ బాయ్స్' జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 'జాన్-ఈ-మన్' (Jan-E-Man) సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe