Ramayana Trailer: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'రామాయణం' (Ramayana) మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ డేట్, టైమ్ అఫీషియల్గా మేకర్స్ రివీల్ చేశారు. జులై 30న తెల్లవారుజామున 4:15 గంటలకు ఈ విజువల్ స్పెక్టకిల్ ట్రైలర్ను గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్తం ఖరారు చేశారు. ఈ బిగ్గెస్ట్ అప్డేట్ బయటకు రావడంతో పాన్-ఇండియా మూవీ లవర్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్కు చేరింది.
హాలీవుడ్ జెయింట్ ఎంట్రీ.. అందుకే ఆలస్యం

నిజానికి ఈ 4 నిమిషాల సుదీర్ఘమైన ప్రమోషనల్ ట్రైలర్ కట్ జులై 24నే ఆన్లైన్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ పంపిణీ హక్కులను ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోనీ పిక్చర్స్ (Sony Pictures) హస్తగతం చేసుకోవడంతో ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా మారాయి.
గ్లోబల్ మార్కెట్లో హాలీవుడ్ సినిమాల రేంజ్లో భారీ ఎత్తున ప్రమోషన్లు ప్లాన్ చేయడంలో భాగంగానే ఈ చిన్న ఆలస్యం జరిగినట్లు ప్రొడక్షన్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
రణ్బీర్, సాయి పల్లవి, యశ్ కాంబో
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవిగా అలరించబోతోంది. 'కేజీఎఫ్' (KGF) సిరీస్తో పాన్-ఇండియా రికార్డులను తిరగరాసిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) ఈ సినిమాలో లంకేశ్వరుడు రావణాసురుడిగా పవర్ఫుల్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనుండటం బిగ్గెస్ట్ హైలైట్గా మారింది.
వీరితో పాటు హనుమంతుడిగా బాలీవుడ్ మాస్ యాక్షన్ కింగ్ సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'దంగల్' డైరెక్టర్ విజన్.. దివాళి 2026 గ్రాండ్ రిలీజ్!
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 2,000 కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిన 'దంగల్' (Dangal) ఫేమ్ నితేష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ వీఎఫ్ఎక్స్ కంపెనీ 'DNEG' అధినేత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 2,000 కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిన 'దంగల్' (Dangal) ఫేమ్ నితేష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ వీఎఫ్ఎక్స్ కంపెనీ 'DNEG' అధినేత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}ఈ ఏడాది దివాళి (Diwali 2026) కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, ప్రపంచ సినిమా వేదికపై మన భారతీయ ఇతిహాస ప్రాశస్త్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.