...
...
Next Story

Ranveer Singh: షాకింగ్.. రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. ఎవరూ అతనికి అవకాశం ఇవ్వొద్దన్న సినీ ఫెడరేషన్.. డాన్ 3 దెబ్బ

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు గట్టి షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్‌తో ఏర్పడిన 'డాన్ 3' (Don 3) వివాదం కారణంగా.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ (FWICE) రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేస్తూ నిషేధం విధించింది.

Published on: May 25, 2026, 18:32:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'డాన్' ఫ్రాంచైజీ మూడో భాగం (Don 3) చుట్టూ నడుస్తున్న వివాదం ముదిరి పాకాన పడింది. ఈ చిత్రం నుండి హీరో రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కార్మిక సంఘాన్ని (FWICE) ఆశ్రయించారు.

Ranveer Singh: షాకింగ్.. రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. ఎవరూ అతనికి అవకాశం ఇవ్వొద్దన్న సినీ ఫెడరేషన్.. డాన్ 3 దెబ్బ
Ranveer Singh: షాకింగ్.. రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. ఎవరూ అతనికి అవకాశం ఇవ్వొద్దన్న సినీ ఫెడరేషన్.. డాన్ 3 దెబ్బ

ఈ నేపథ్యంలో సోమవారం (మే 25) సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశం అనంతరం, రణ్‌వీర్ సింగ్‌తో ఎలాంటి సినిమా ప్రాజెక్టులలోనూ సహకరించవద్దని చిత్ర పరిశ్రమకు FWICE స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది?

గత ఏడాది (2025) డిసెంబర్‌లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించిన తర్వాత.. రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని పట్టుబట్టారట. అయితే దీనికి ఫర్హాన్ అక్తర్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామి రితేష్ సిధ్వానీ అంగీకరించకపోవడంతో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారు.

సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు అప్పటికే ప్రారంభం కావడంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) ద్వారా ఫర్హాన్ FWICE కి ఫిర్యాదు చేశారు. అలాగే రణ్‌వీర్‌పై లీగల్ సూట్ ఫైల్ చేసి రూ. 40 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు.

ఫెడరేషన్ నోటీసులను తిరస్కరించిన రణ్‌వీర్

ఫర్హాన్ ఫిర్యాదుపై విచారణ జరిపిన FWICE.. వివరణ ఇవ్వాల్సిందిగా రణ్‌వీర్ సింగ్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై రణ్‌వీర్ స్పందిస్తూ.. తమ మధ్య ఉన్న ఒప్పందపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఫెడరేషన్ అనేది 'సరైన వేదిక' కాదంటూ కొట్టిపారేశారు.

ఈ వివాదంపై ఫర్హాన్ అక్తర్ ఇటీవల 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'తో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. "నేను ఇండస్ట్రీలో నేర్చుకున్నది ఒక్కటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. సినిమా రోల్ పైన పడేవరకు దేనినీ గుడ్డిగా నమ్మలేము. కెరీర్‌లో కొన్నిసార్లు ఇలాంటి సవాలుతో కూడిన రోజులు వస్తాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగాలి. ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు, ఇవన్నీ పక్కన పెట్టి నేను కేవలం నటనపైనే దృష్టి పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అప్పుడైతే ఈ గొడవలన్నీ ఉండవు" అని ఫర్హాన్ పేర్కొన్నారు.

మధ్యలో రణ్‌వీర్ స్థానంలో హృతిక్ రోషన్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే హృతిక్ ఆ వార్తలను ఖండించారు. కాగా ఈ సమస్యను కోర్టుల చుట్టూ తిప్పకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రెండు వర్గాలకు సూచించినప్పటికీ, వివాదం చివరికి నిషేధానికి దారితీసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రణ్‌వీర్ సింగ్‌పై FWICE ఎందుకు నిషేధం విధించింది?

దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం 'డాన్ 3' నుండి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం, ఆ తర్వాత ఫెడరేషన్ ఇచ్చిన నోటీసులను రణ్‌వీర్ తిరస్కరించడంతో ఆయనపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ అయింది.

2. రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' నుండి ఎందుకు తప్పుకున్నారు?

తను నటించిన 'ధురంధర్' సినిమా విజయవంతం కావడంతో, రణ్‌వీర్ 'డాన్ 3' స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని కోరారు. దీనికి మేకర్స్ ఒప్పుకోకపోవడంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.

3. ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్ నుండి ఎంత నష్టపరిహారం కోరుతున్నారు?

సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నిలిచిపోయినందుకు గాను ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్ నుండి రూ. 40 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe