...
...
Next Story

Rashmika Mandanna: ఇదో గొప్ప గౌరవం.. కొందరు లెజెండ్స్ ఎప్పటికీ ఉండిపోతారు: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై రష్మిక పోస్ట్

Rashmika Mandanna: లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించనుండటంపై రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది తనకు ఓ గొప్ప గౌరవం అంటూ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ డేట్,టైమ్ రివీల్ చేశారు.

Published on: Sep 15, 2026, 20:20:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్‌లోనే అత్యంత ఛాలెంజింగ్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కర్ణాటక సంగీత ప్రపంచపు ధ్రువతార, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రష్మిక బిగ్ అనౌన్స్‌మెంట్..

Rashmika Mandanna: ఇదో గొప్ప గౌరవం.. కొందరు లెజెండ్స్ ఎప్పటికీ ఉండిపోతారు: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై రష్మిక పోస్ట్
Rashmika Mandanna: ఇదో గొప్ప గౌరవం.. కొందరు లెజెండ్స్ ఎప్పటికీ ఉండిపోతారు: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై రష్మిక పోస్ట్

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో నటించడం తనకు లభించిన గొప్ప గౌరవం అని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. "కొందరు లెజెండ్స్ కాలానికి అతీతంగా నిలుస్తారు. కొన్ని మధురమైన స్వరాలు తరతరాల పాటు వినిపిస్తూనే ఉంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప కథలు బయటకు వస్తాయి" అంటూ తన ఎమోషన్‌ను షేర్ చేసుకుంది.

ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెప్టెంబర్ 16 సాయంత్రం 5:15 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు విశ్వనటుడు, లోక్‌సభ ఎంపీ కమల్ హాసన్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కానుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గౌతమ్ తిన్ననూరి - అనిరుధ్ కాంబో మ్యాజిక్

స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'తో నేషనల్ అవార్డ్ సాధించిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేస్తున్నారు. అతడు చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి తీసిన కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ఈ పీరియాడిక్ మ్యూజికల్ డ్రామా కోసం మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట.

ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక సంగీత సముద్రం. 1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించిన సుబ్బులక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో కర్ణాటక సంగీతాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లారు.

యూరోప్, నార్త్ అమెరికాతో పాటు ఐక్యరాజ్యసమితి (UN General Assembly) వేదికగా పాటలు పాడి ప్రపంచాన్ని మైమరిపించిన ఏకైక భారతీయ గాయని ఆమె. మన దేశంలో ప్రతిరోజూ వేకువజామున వినిపించే వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామాలకు ఆమె స్వరం అమరత్వాన్ని ఇచ్చింది. 'నాగేంద్ర హారాయ', 'శివ పంచాక్షరి' స్తోత్రాలతో పాటు అన్నమయ్య కీర్తనలకు ఆమె ప్రాణం పోశారు.

1998లో భారత ప్రభుత్వం ఆమెను దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'తో సత్కరించింది. భారతరత్న పొందిన తొలి సంగీత విద్వాంసురాలు ఆమె కావడం విశేషం. అంతేకాకుండా ప్రతిష్టాత్మక 'రామన్ మెగసేసే' అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ కూడా సుబ్బులక్ష్మియే.

1997లో ఆమె భర్త కల్కి సదాశివం మరణించిన తర్వాత, సుబ్బులక్ష్మి లైవ్ కాన్సర్ట్‌లకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు. 2004 డిసెంబర్ 11న ఆమె తన 88వ ఏట తుది శ్వాస విడిచారు.

రష్మిక కెరీర్‌లో బిగ్గెస్ట్ ల్యాండ్‌మార్క్ మూవీ

'పుష్ప', 'యానిమల్', 'ఛావా' లాంటి బ్యాక్ టు బ్యాక్ పాన్-ఇండియా హిట్స్‌తో దూసుకుపోతున్న రష్మికకు ఈ బయోపిక్ కెరీర్ డిఫైనింగ్ ప్రాజెక్ట్‌గా మారనుంది. ఒక లెజెండరీ క్లాసికల్ సింగర్ బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్, వాయిస్ సీరియస్‌నెస్‌ను స్క్రీన్ మీద పండించడం రష్మికకు పెద్ద టెస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా షూటింగులలో బిజీగా ఉండగా.. ఇప్పుడీ బయోపిక్ కూడా ఆమె లిస్టులో చేరింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks