టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అక్టోబర్లోనే సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్.. 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్లో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాళ్ల సన్నిహిత వర్గాలే తెలిపాయి.
రష్మిక, విజయ్ పెళ్లి డేట్, వెన్యూ ఇవే

గీత గోవిందం జంట త్వరలో రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్షిప్ గురించి బయట ఎక్కడా చెప్పకపోయినా.. పెళ్లి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ కు ఈ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
విజయ్, రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లితో ఒక్కటవనున్నారు. వీళ్లు రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లోని ఓ హిస్టారిక్ ప్యాలెస్ ను ఇప్పటికే బుక్ చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి కూడా సింపుల్గానే..
రష్మిక, విజయ్ ఎంగేజ్మెంట్ ఎవరికీ తెలియకుండా చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఈ జంట అఫీషియల్ గా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ లాగానే.. పెళ్లి కూడా చాలా ప్రైవేట్గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగనుంది. హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఇస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అక్టోబర్లోనే ఎంగేజ్మెంట్
అక్టోబర్ 3, 2025న (దసరా మరుసటి రోజు) హైదరాబాద్లో వీరిద్దరూ సీక్రెట్గా ఉంగరాలు మార్చుకున్నారని విజయ్ టీమ్ అప్పట్లో ధృవీకరించింది. అప్పటి నుంచే ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరూ వేళ్లకు ఉంగరాలతో కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈమధ్యే ఈ జంట వెకేషన్ కోసం బయటకు వెళ్లింది. ఎయిర్పోర్టులో కనిపించిన వీళ్ల వీడియోలు వైరల్ అయ్యాయి.
విజయ్, రష్మిక లవ్ స్టోరీ ఇలా..
ఈ మధ్యకాలంలో రష్మిక, విజయ్ పరోక్షంగా తమ ప్రేమను బయటపెడుతూనే ఉన్నారు. 'ది గర్ల్ఫ్రెండ్' మూవీ ఈవెంట్లో విజయ్.. రష్మిక పట్ల చూపించిన కేరింగ్ వైరల్ అయ్యింది. ఆ సమయంలో పబ్లిగ్గా రష్మిక చేతిని విజయ్ ముద్దాడాడు.
{{/usCountry}}ఈ మధ్యకాలంలో రష్మిక, విజయ్ పరోక్షంగా తమ ప్రేమను బయటపెడుతూనే ఉన్నారు. 'ది గర్ల్ఫ్రెండ్' మూవీ ఈవెంట్లో విజయ్.. రష్మిక పట్ల చూపించిన కేరింగ్ వైరల్ అయ్యింది. ఆ సమయంలో పబ్లిగ్గా రష్మిక చేతిని విజయ్ ముద్దాడాడు.
{{/usCountry}}"నాకు సంబంధం లేని బాధ నుంచి కూడా నా పార్ట్నర్ నన్ను కోలుకునేలా చేశాడు" అని రష్మిక ఇటీవల వ్యాఖ్యానించింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఈ జంట ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఇండియా డే పరేడ్లో కూడా వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు.