మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన రష్మిక మందన్న.. మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరిపోయిందంటూ పోస్ట్

తన మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పింది రష్మిక మందన్న. తన కాబోయే భర్త విజయ్ దేవరకొండ తమ్ముడు, నటుడు ఆనంద్ దేవరకొండ నెక్ట్స్ మూవీ ఎపిక్ టైటిల్ గ్లింప్స్ షేర్ చేస్తూ ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Dec 2, 2025, 16:13:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది అక్టోబర్‌లో అత్యంత సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో తన కాబోయే మరిది ఆనంద్ దేవరకొండకు రష్మిక ఆల్ ద బెస్ట్ చెప్పింది. తాజాగా అతడు నటిస్తున్న కొత్త సినిమా కోసం రష్మిక సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్ రాసింది.

మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన రష్మిక మందన్న.. మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరిపోయిందంటూ పోస్ట్
మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన రష్మిక మందన్న.. మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరిపోయిందంటూ పోస్ట్

ఆనంద్‌కు రష్మిక ఆల్ ద బెస్ట్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'ఎపిక్' (Epic). తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌పై స్పందిస్తూ రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనంద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి జరగనున్న నేపథ్యంలో కాబోయే మరిదికి రష్మిక తెలిపిన మద్దతు నెట్టింట వైరల్ అవుతోంది.

సోమవారం (డిసెంబర్ 1) సాయంత్రం ఆనంద్ దేవరకొండ నటిస్తున్న రాబోయే మూవీ 'ఎపిక్' టీమ్ సోషల్ మీడియాలో ఒక గ్లింప్స్‌ను పంచుకుంది. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీ-షేర్ చేసిన రష్మిక ఆనంద్‌ను ఉద్దేశించి ఇలా రాసుకొచ్చింది. "ఎపిక్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్! ఆనంద్ దేవరకొండ.. నీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటానని నీకు తెలుసు. (రెడ్ హార్ట్ ఎమోజీలు). అదరగొట్టేయండి గాయ్స్.. ఇది చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది" అని ఆమె రాసింది.

ఈ పోస్ట్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య, దర్శకుడు ఆదిత్య హాసన్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్‌లను కూడా ఆమె ట్యాగ్ చేసింది. రష్మిక పోస్ట్‌ను ఆనంద్ లవ్ ఎమోజీలతో రీ-షేర్ చేశాడు.

అన్నయ్య విజయ్ రియాక్షన్ ఇదే

రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా తమ్ముడి సినిమాపై స్పందించాడు. ఈటీవీ విన్ లో వచ్చిన #90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ తనకు ఎంతో ఇష్టమైన తెలుగు షో అని విజయ్ తెలిపాడు.

"నాకు అత్యంత ఇష్టమైన తెలుగు షో - 90s ఇప్పుడు ఒక లవ్ స్టోరీగా మారుతోంది.. EPIC. దీని కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని విజయ్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ రాశాడు. '90s' సిరీస్‌లోని ఆదిత్య పాత్ర (రోహన్ రాయ్) పెద్దయ్యాక, విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత జరిగే కథే ఈ 'ఎపిక్' అని తెలుస్తోంది.

విజయ్ - రష్మిక రిలేషన్ గురించి..

'గీత గోవిందం' (2018), 'డియర్ కామ్రేడ్' (2019) సినిమాల్లో కలిసి నటించినప్పటి నుంచే విజయ్, రష్మిక మధ్య ప్రేమాయణం సాగుతోందనే వార్తలు వచ్చాయి. 2020 నుండి 2024 మధ్య ఈ జంట తరచుగా వెకేషన్లకు వెళ్లడం, కలిసి సమయం గడపడం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. 2024లో తాము సింగిల్ కాదని ఇద్దరూ పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ, పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

అయితే ఈ ఏడాది దసరా సమయంలో హైదరాబాద్‌లో వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ ధృవీకరించింది. వీరిద్దరూ బహిరంగంగా ప్రకటించకపోయినా చేతికి ఉంగరాలతో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More