ఓటీటీలోకి వస్తున్న తొలి సంక్రాంతి మూవీ ఇదే.. రవితేజ మరో డిజాస్టర్ స్ట్రీమింగ్ ఆరోజే!
సంక్రాంతి కానుకగా వచ్చిన మాస్ మహారాజా రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జీ5 వేదికగా ఫిబ్రవరిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. జనవరి 13న సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుని.. బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) భారీ ధరకు సొంతం చేసుకుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్
రవితేజ నటించిన మరో డిజాస్టర్ మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు హీరోయిన్లతో పండగకు వచ్చి సందడి చేసినా అతని రాత మారలేదు. మిగిలిన నాలుగు సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది.
తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జీ5 ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. దాదాపుగా ఇదే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదిరితే ఈ తేదీ కంటే ముందే విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఓటీటీలోకి ఈసారి రానున్న తొలి సంక్రాంతి మూవీ ఇదే కానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి విశేషాలు
రవితేజ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో మాస్ ఇమేజ్ పక్కనపెట్టి కొత్తగా ప్రయత్నించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండటం సినిమాకు మైనస్ అయింది. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు.. ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సంక్రాంతికి భారీ విజయాలు సాధించడంతో రవితేజ సినిమా వెనుకబడిపోయింది.
ఈ సినిమాలో రవితేజ ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తాడు. భార్య (డింపుల్ హయతి), మరో మహిళ (ఆషికా రంగనాథ్) మధ్య నలిగిపోయే పాత్రలో అతడు నటించాడు. ఒక బిజినెస్ ట్రిప్ కోసం యూరప్ వెళ్ళినప్పుడు ఆషికాతో ఏర్పడిన సంబంధం, అతని వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు తెచ్చిందన్నది కథ. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగున్నప్పటికీ.. సెకండాఫ్, ఎమోషనల్ సన్నివేశాలు పండకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకోకపోవడంతో సినిమా నిరాశపరిచింది.
ప్రస్తుతం రవితేజ తన తదుపరి మూవీ ‘ఇరుముడి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రీ కూతుళ్ళ బంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ కథ అని సమాచారం. అయితే ఇది మలయాళం మూవీకి కాపీ అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


