ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ (మార్చి 28) ప్రారంభమైంది. ఐపీఎల్ తొలి రోజున సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ పోడీ పడనున్నాయి. ఈపాటికే ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక విషాద జ్ఞాపకంతో నిశ్శబ్దమైంది.
అభిమానుల పట్ల ప్రేమ

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఆర్సీబీ యాజమాన్యం తమ అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ ఎంతో భావోద్వేగపూరిత నిర్ణయం తీసుకుంది.
11 మంది మృతి
గత ఏడాది జూన్ 4న ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ 11 ప్రాణాలకు గుర్తుగా ఈ మ్యాచ్లో ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులు అర్పించారు.
ఎప్పటికీ ఖాళీగానే ఆ 11 సీట్లు..
గత ఏడాది జరిగిన ఆ దుర్ఘటనను గుర్తుచేసుకుంటూ, చిన్నస్వామి స్టేడియంలోని 11 సీట్లను ఈ సీజన్ మొత్తం ఖాళీగా ఉంచాలని ఆర్సీబీ నిర్ణయించింది. "మా కుటుంబంలో సభ్యులైన ఆ 11 మంది అభిమానులకు ఇది మా శాశ్వత నివాళి. వారి మద్దతు ఎప్పటికీ ఆర్సీబీ కుటుంబంలో భాగంగానే ఉంటుంది" అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.
11 మంది జ్ఞాపకార్థం
కేవలం మ్యాచ్లోనే కాకుండా, ప్రాక్టీస్ సమయంలోనూ ఆటగాళ్లు 'నెంబర్ 11' కలిగిన జెర్సీలను ధరించి వారిని స్మరించుకున్నారు. మరోవైపు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆ 11 మంది జ్ఞాపకార్థం స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఒక స్మారక ఫలకాన్ని కూడా ఆవిష్కరించింది. గతేడాది జరిగిన చేదు అనుభవం దృష్ట్యా, ఈసారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలను, ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ను అధికారులు రద్దు చేశారు.
2 నిమిషాల పాటు మౌనం
అలాగే, ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందే బౌండరీ లైన్ వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ మృతులకు 2 నిమిషాలు పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
టాస్ గెలిచిన ఆర్సీబీ.. కొత్త ముఖాలతో బరిలోకి!
{{/usCountry}}అలాగే, ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందే బౌండరీ లైన్ వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ మృతులకు 2 నిమిషాలు పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
టాస్ గెలిచిన ఆర్సీబీ.. కొత్త ముఖాలతో బరిలోకి!
{{/usCountry}}కాగా, ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున అభినందన్ సింగ్, జాకబ్ డఫీ అరంగేట్రం చేస్తుండగా, ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ఇంపాక్ట్ ప్లేయర్గా రానున్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ అన్క్యాప్డ్ ప్లేయర్ సలిల్ అరోరాకు అవకాశం ఇచ్చింది.
తుది జట్లు ఇవే:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.
సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగ.