రెబల్ స్టార్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. ది రాజా సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్.. ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ పూర్తయిన సందర్భంగా..
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 23 ఏళ్లయిన సందర్భంగా ది రాజా సాబ్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ మారుతి ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో వైరల్ గా మారింది.
ప్రభాస్ లీడ్ రోల్ లో, మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే తాజాగా మంగళవారం (నవంబర్ 11) మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు.

ప్రభాస్ ది రాజా సాబ్ పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ హారర్ కామెడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అభిమానులు ఊహించని విధంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ వచ్చింది. డైరెక్టర్ మారుతి ఈ పోస్టర్ ను షేర్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి ప్రభాస్ వచ్చి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టర్ ను తీసుకురావడం విశేషం. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. నోట్లో సిగార్ తో ప్రభాస్ లుక్ వైరల్ అవుతోంది.
“23 ఏళ్ల కిందట అతడు సినిమాలో తొలి అడుగు వేశాడు. అదే రోజు ది రాజా సాబ్ లో అతడు తన ప్రయాణాన్ని ముగించాడు. అతని ఈ జైత్రయాత్రలో నేనూ భాగమైనందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ది రాజా సాబ్ పూర్తిగా భిన్నమైన ఎనర్జీ అని సూపర్ షూర్ గా ఉన్నాను. మీ ప్రేమ, అసహనం గురించి తెలుసు. కచ్చితమైన బెస్ట్ అందిస్తామన్న నమ్మకం ఉంది. రెబల్ గాడ్ భక్తులకు ముందు ముందు మరిన్ని సెలబ్రేటింగ్ రోజులు రానున్నాయి” అని మారుతి ట్వీట్ చేశాడు.
ది రాజా సాబ్ గురించి..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తర్వాత నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఆలస్యమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


