సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి అన్‌ఫాలో రచ్చ.. ఆ హీరోయిన్‌నూ వదల్లేదు.. కాంతార కో స్టార్స్‌తో గొడవ పడ్డాడా?

కాంతార మూవీ స్టార్ రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ లో వరుసగా అందరినీ అన్ ఫాలో చేస్తూ వెళ్లడం సంచలనం రేపుతోంది. మొదట హోంబలే ఫిల్మ్స్, తర్వాత రుక్మిణి వసంత్, రాజ్ బీ శెట్టిలను అతడు అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది.

Mar 28, 2026, 10:57:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాంతార చాప్టర్ 1 సినిమాలో లీడ్ రోల్ చేసి, ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారాడు. తన కో స్టార్స్‌ను సోషల్ మీడియాలో అతను అన్‌ఫాలో చేయడమే ఈ రచ్చకు ముఖ్య కారణం. చివరికి మూవీలో హీరోయిన్ గా చేసిన రుక్మిణి వసంత్ ను కూడా అతడు అన్ ఫాలో కావడం విశేషం.

సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి అన్‌ఫాలో రచ్చ.. ఆ హీరోయిన్‌నూ వదల్లేదు.. కాంతార కో స్టార్స్‌తో గొడవ పడ్డాడా?
సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి అన్‌ఫాలో రచ్చ.. ఆ హీరోయిన్‌నూ వదల్లేదు.. కాంతార కో స్టార్స్‌తో గొడవ పడ్డాడా?

రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను అన్‌ఫాలో చేసిన రిషబ్..

బెంగళూరు టైమ్స్ లాంటి మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే.. రిషబ్ శెట్టి తన కో స్టార్స్ అయిన రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన రిషబ్ ఫాలోయింగ్ లిస్ట్‌లో ఇప్పుడు వాళ్ల పేర్లు అస్సలు కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ల మధ్య ఏదో టెన్షన్ నడుస్తోందని, పెద్ద గొడవే జరిగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

సరిగ్గా ఇదే టైమ్‌లో కాంతార మేకర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ కంపెనీని కూడా రిషబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఇంకో సెన్సేషన్ అయింది. అయితే వీళ్ల మధ్య నిజంగానే ఏదైనా మనస్పర్థలు వచ్చాయా లేక ఎలాంటి రీజన్ లేకుండానే మామూలుగా క్యాజువల్‌గా అన్‌ఫాలో చేశాడా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. హోంబలే ఫిల్మ్స్ అకౌంట్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆ సంస్థ హెడ్ విజయ్ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు.

కాంతార చాప్టర్ 1 స్టోరీ, కాస్ట్ డీటెయిల్స్ ఇవే..

రిషబ్ శెట్టి రీసెంట్‌గా కాంతార చాప్టర్ 1 సినిమాలో నటించి డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ పార్ట్‌కు వందల ఏళ్ల క్రితం జరిగే కథగా దీన్ని తెరకెక్కించారు. సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా దొరికే ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూసే ఒక క్రూరమైన భంగ్రా రాజు కథ ఇది. ప్రశాంతంగా జీవించే కాంతార తెగ ప్రజలపై అతను దాడి చేసినప్పుడు పంజూర్లి దైవం, గుళిగ దైవం వచ్చి అతన్ని దారుణంగా చంపేస్తాయి.

ఆ తర్వాత అతని కొడుకు విజయేంద్ర చాలా బాధలను అనుభవిస్తూ పెరిగి, ఒక మంచి రాజుగా మారతాడు. కానీ ఏళ్లు గడిచాక అతని కొడుకు కులశేఖర సింహాసనం ఎక్కిన తర్వాత మళ్లీ తన తాత బుద్ధులు చూపిస్తూ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. రాజ కుటుంబానికి, గిరిజనులకు మధ్య జరిగే ఈ పోరాటంలో దేవుళ్లు వచ్చి అమాయకులను ఎలా కాపాడారు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు.

హనుమంతుడిగా రిషబ్ నెక్స్ట్ సినిమా..

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నెక్స్ట్ మెయిన్ లీడ్‌గా నటించబోతున్నాడు. ఇదొక హై బడ్జెట్ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా. 2024లో వచ్చి సూపర్ హిట్ అయిన హనుమాన్ సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో రిషబ్ సాక్షాత్తూ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు. 2026 ఫిబ్రవరిలో హంపిలో జరిగిన ఒక స్పెషల్ పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రొడక్షన్ అఫీషియల్‌గా మొదలైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More