Yash Alibag: అలీబాగ్‌లో పాన్ ఇండియా స్టార్ యశ్ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. రూ.24 కోట్లతో సముద్ర తీరంలో లగ్జరీ ప్రాపర్టీ!

Yash Alibag: కన్నడ రాకింగ్ స్టార్, 'కేజీఎఫ్' (KGF) హీరో యశ్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి మహారాష్ట్రలోని పాపులర్ సెలబ్రిటీ డెస్టినేషన్ అలీబాగ్‌లో ఓ భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ ల్యాండ్ కోసం ఏకంగా రూ. 24 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

Published on: Jun 5, 2026, 12:36:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yash Alibag: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్' సిరీస్‌తో ఏ రేంజ్ పాన్-ఇండియా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు యశ్ కేవలం సినిమాల పరంగానే కాకుండా.. బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా బాలీవుడ్ స్టార్స్‌కు దీటుగా పావులు కదుపుతున్నాడు. తాజాగా యశ్, రాధికా పండిట్ జంట ముంబైకి దగ్గరలో ఉండే అలీబాగ్‌ (Alibag) లో ఒక ఖరీదైన ల్యాండ్ కొనుగోలు చేశారు.

Yash Alibag: అలీబాగ్‌లో పాన్ ఇండియా స్టార్ యశ్ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. రూ.24 కోట్లతో సముద్ర తీరంలో లగ్జరీ ప్రాపర్టీ!
Yash Alibag: అలీబాగ్‌లో పాన్ ఇండియా స్టార్ యశ్ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. రూ.24 కోట్లతో సముద్ర తీరంలో లగ్జరీ ప్రాపర్టీ!

రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే..

బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ తాలూకాలోని కామత్ (Kamath) గ్రామంలో యశ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఇది రెండు వ్యవసాయ భూములను కలిపి తీసుకున్న ల్యాండ్. మే 18న అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో దీని రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ డీల్ వాల్యూ రూ. 24 కోట్లు కాగా.. కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే యశ్ రూ. 1.44 కోట్లు కట్టడం గమనార్హం.

సుమారు 5,289 చదరపు మీటర్ల (0.5289 హెక్టార్లు) విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో ఒక నివాస భవనం కూడా ఉంది. తూర్పు వైపు ఊరి రోడ్డు, పశ్చిమం వైపు అందమైన అరేబియా సముద్రం ఉండటం ఈ ల్యాండ్ స్పెషాలిటీ.

సెలబ్రిటీలంతా ఆలీబాగ్‌కే ఎందుకు వెళ్తున్నారు?

గత కొన్నేళ్లుగా అలీబాగ్ ఇండియాలోనే బెస్ట్ లగ్జరీ హాలిడే డెస్టినేషన్‌గా మారిపోయింది. ముంబై ట్రాఫిక్, ఉరుకులు పరుగుల జీవితానికి దూరంగా.. ప్రశాంతమైన వాతావరణం, సీ-వ్యూ ఉండటంతో బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్ ఇక్కడ 'సెకండ్ హోమ్' నిర్మించుకోవడానికి క్యూ కడుతున్నారు. ముంబై నుంచి ఫెర్రీ (రో-రో) ద్వారా కేవలం గంటలోపే ఇక్కడికి చేరుకోవచ్చు.

యశ్‌ కంటే ముందే ఇక్కడ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 'డేజా వు ఫార్మ్స్' పేరుతో ఒక అదిరిపోయే సీ-ఫేసింగ్ ప్రాపర్టీ కొన్నాడు. రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొనే జోడీ సుమారు రూ.22 కోట్లతో కిహిమ్ బీచ్ దగ్గర ఒక 5BHK విల్లాను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ కూడా జిరాద్ ఏరియాలో 8 ఎకరాల ల్యాండ్‌లో ఒక లగ్జరీ విల్లా నిర్మించుకున్నారు. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా రీసెంట్‌గా రూ. 12.91 కోట్లతో తాల్ (Thal) గ్రామంలో ప్రాపర్టీ తీసుకుంది.

ప్రస్తుతం యశ్ ఫ్యామిలీ బెంగళూరులోని 'ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ డ్యూప్లెక్స్'లో ఉంటోంది. దీని వాల్యూ సుమారు రూ. 6 నుంచి 8 కోట్లు ఉంటుందని అంచనా. వాళ్లకు కర్ణాటకలో ఒక సొంత ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ (రామాయణ్ లాంటివి) లైనప్‌లో ఉండటంతో ముంబైకి దగ్గర్లో ఉండేలా అలీబాగ్‌లో ఏకంగా రూ. 24 కోట్లు పెట్టి యశ్ ఇన్వెస్ట్ చేయడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

రాకింగ్ స్టార్ యశ్ కొత్తగా కొన్న ప్రాపర్టీ వాల్యూ ఎంత?

యశ్, రాధికా పండిట్ జంట మహారాష్ట్రలోని అలీబాగ్‌లో రూ. 24 కోట్లు పెట్టి ఒక సముద్ర తీర ప్రాపర్టీని కొనుగోలు చేశారు.

సెలబ్రిటీలు అలీబాగ్‌లో ఎందుకు ఇళ్లు కొంటున్నారు?

ముంబైకి చాలా దగ్గర్లో ఉండటం, అక్కడి రద్దీకి దూరంగా ప్రశాంతమైన బీచ్ వాతావరణం ఉండటం వల్ల సెలబ్రిటీలు అలీబాగ్‌ను హాలిడే హోమ్స్‌గా మార్చుకుంటున్నారు.

అలీబాగ్‌లో ఇళ్లు ఉన్న ఇతర సెలబ్రిటీలు ఎవరు?

షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ తదితరులకు అలీబాగ్‌లో లగ్జరీ విల్లాలు ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More