మొన్న శ్రీలీల.. ఇప్పుడు సాయి పల్లవి.. ధనుష్ మూవీలో ఇద్దరు ముద్దుగుమ్మలు.. కన్ఫమ్ చేసిన టీమ్

ధనుష్ 55వ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే శ్రీలీల పేరును ప్రకటించిన మేకర్స్.. తాజాగా నేషనల్ క్రష్ సాయి పల్లవి ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. 'మారి 2' తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ కలుస్తుండటంతో అంచనాలు ఆకాశన్నంటాయి.

Published on: Feb 02, 2026 5:33 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 55వ సినిమా (D55) కాస్టింగ్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ వరుసగా నటీనటుల వివరాలను అనౌన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఇందులో భాగంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ మూవీలో కథానాయికగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నట్లు నిర్మాతలు సోమవారం (ఫిబ్రవరి 2) అధికారికంగా అనౌన్స్ చేశారు.

మొన్న శ్రీలీల.. ఇప్పుడు సాయి పల్లవి.. ధనుష్ మూవీలో ఇద్దరు ముద్దుగుమ్మలు.. కన్ఫమ్ చేసిన టీమ్
మొన్న శ్రీలీల.. ఇప్పుడు సాయి పల్లవి.. ధనుష్ మూవీలో ఇద్దరు ముద్దుగుమ్మలు.. కన్ఫమ్ చేసిన టీమ్

మళ్లీ వస్తున్న 'రౌడీ బేబీ' మ్యాజిక్

సాయి పల్లవి రాకతో D55 ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ధనుష్, సాయి పల్లవి కలిసి నటించడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'మారి 2' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వీరిద్దరి కెమిస్ట్రీ, ఆ సినిమాలోని 'రౌడీ బేబీ' పాటలో వేసిన స్టెప్పులు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

డైరెక్టర్‌తో సాయి పల్లవికి ఇది రెండోసారి

ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. విశేషమేమిటంటే దర్శకుడితో కూడా సాయి పల్లవికి ఇది రెండో సినిమా. ఇటీవలే శివకార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ తెరకెక్కించిన 'అమరన్' మూవీలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య 'ఇందు రెబెక్కా వర్గీస్' పాత్రలో జీవించింది. ఆ పాత్రకు ఆమెకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే దర్శకుడితో మరోసారి చేతులు కలపడం ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

వరుస విజయాలు, అవార్డుల పంట

సాయి పల్లవి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాగ చైతన్య సరసన నటించిన 'తండేల్' సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది. అలాగే 'గార్గి' చిత్రంలోని అద్భుత నటనకు గాను ఇటీవలే ఆమెను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు వరించింది. మరోవైపు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ 'రామాయణ్' షూటింగ్‌లోనూ ఆమె బిజీగా ఉంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీతగా కనిపించనుంది.

శ్రీలీల, మమ్ముట్టి.. భారీ తారాగణం

D55లో సాయి పల్లవితో పాటు మరో కథానాయికగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. ధనుష్‌తో శ్రీలీల నటిస్తుండటం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాకు యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న 'పాదయాత్ర' సినిమా షూటింగ్ పూర్తయ్యాక మమ్ముట్టి ఈ సెట్స్‌లో జాయిన్ అవుతారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ ఈ చిత్రాన్ని సహ-నిర్మాణం చేస్తోంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఏది ఏమైనా ధనుష్ - సాయి పల్లవి - రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్ అనగానే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.