బ్యాడ్మింటన్లో ఒలింపిక్స్ లో తొలి మెడల్ అందించి భారతీయులంతా గర్వపడేలా చేసిన ప్లేయర్ సైనా నెహ్వాల్. ఆమె ఈ మధ్యే ఆటకు గుడ్ బై చెప్పింది. అయితే ఐదేళ్ల కిందటే సైనా బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో లీడ్ రోల్లో నటించిన పరిణీతి చోప్రా తనను ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు ఫాలో కావడం లేదో తాజాగా సైనా వివరించింది.
అసలు గమనించలేదు..

2021లో వచ్చిన ‘సైనా’ బయోపిక్ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా మెప్పించింది. అయితే సైనా నెహ్వాల్ ఇన్స్టాగ్రామ్లో పరిణీతిని ఫాలో అవుతున్నప్పటికీ.. పరిణీతి మాత్రం సైనాను తిరిగి ఫాలో అవ్వడం లేదని నెటిజన్లు గుర్తించారు. నిజానికి సైనా కూడా పరిణీతిని ఫాలో కావడం లేదు. దీనిపై ఒక యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ సైనా స్పందించింది.
ఈ విషయంపై సైనా మాట్లాడుతూ.. "నిజానికి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో బిజీగా ఉండటం వల్ల దీనిపై దృష్టి పెట్టలేదు. మా మధ్య జరిగిన సంభాషణలు కూడా కేవలం సినిమాకు సంబంధించినవే తప్ప, మేం స్నేహితులుగా మారేలా ఏమీ జరగలేదు" అని చెప్పింది.
కేవలం పని కోసమే కలిసేవాళ్లం..
"నేను నా జీవిత విశేషాలు చెప్పడానికి ఒక ప్రొఫెషనల్గా ఆమెను కలిసేదాన్ని. అంతేకానీ మేం ఎప్పుడూ కలిసి లంచ్ లేదా డిన్నర్లకు వెళ్లలేదు. రెండు, మూడు వారాలకు ఒకసారి డైరెక్టర్తో కలిసి ఒకటి రెండు గంటలు మాత్రమే కలిసేవాళ్ళం. ఆ సమయంలో నా ప్రయాణం గురించి ఆమెకు వివరించేదాన్ని. స్నేహితులుగా మారేంత సమయం మేం గడపలేదు. మా బంధం కేవలం ఆ సినిమా పని వరకే పరిమితం. అందుకే ఫాలో అవ్వడం లేదా అన్ఫాలో చేయడం అనే విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు" అని సైనా వివరించింది.
ఈరోజు వరకూ చూస్తే ఇటు సైనా గానీ, అటు పరిణీతి గానీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం లేదు. ‘సైనా’ మూవీ 2021లో విడుదలైంది. పరిణీతి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}ఈరోజు వరకూ చూస్తే ఇటు సైనా గానీ, అటు పరిణీతి గానీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం లేదు. ‘సైనా’ మూవీ 2021లో విడుదలైంది. పరిణీతి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}