Maa Inti Bangaram OTT: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జూన్ 19న థియేటర్లలోకి వచ్చి.. కేవలం ఒక సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్గా రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది.
మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్

గత కొన్ని రోజులుగా మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ పార్ట్నర్ గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ చిత్రం సరికొత్త ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ (JioHotstar) లో జూలై 17 నుంచి అఫీషియల్గా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "ఒక్కొక్కడ్ని కొడతాము చూడు.. ప్రేమతో అబ్బా" అంటూ సమంత క్యారెక్టర్కు సంబంధించిన పవర్ఫుల్ డైలాగ్తో ఈ డిజిటల్ అరైవల్ను అధికారికంగా అనౌన్స్ చేశారు.
4 వారాలకు ముందే
సాధారణంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన పెద్ద సినిమాలకు థియేటర్ల రన్ తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల ‘విండో పీరియడ్’ ఉంటుంది. కానీ ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలై.. కరెక్ట్గా 4 వారాలు పూర్తి కాకముందే (జూలై 17న) ఓటీటీలోకి వస్తోంది.
దీనికి ప్రధాన కారణం.. జియోహాట్స్టార్ సంస్థ థియేట్రికల్ రిలీజ్కు ముందే కుదుర్చుకున్న ‘అర్లీ డిజిటల్ ప్రీమియర్’ ఒప్పందమే. థియేటర్లలో సినిమా బ్లాక్బస్టర్ కావడంతో, ఈ విండో పీరియడ్ను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది.
ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదు?
నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు క్రియేటివ్ మేకింగ్లో వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం ఒక పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తన ఇంటిని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఈ సినిమా కథ.
{{/usCountry}}నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు క్రియేటివ్ మేకింగ్లో వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం ఒక పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తన ఇంటిని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఈ సినిమా కథ.
{{/usCountry}}థియేటర్లలో మిస్ అయిన క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీస్.. సమంత పండించిన హోమ్లీ సెంటిమెంట్ను, గుల్షన్ దేవయ్య నెగటివ్ పర్ఫార్మెన్స్ను డిజిటల్ స్క్రీన్స్పై ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ కానుంది.