Samantha: పిల్లలు లేకపోయినా సరే అనుకున్నాం.. అందుకే ఇది మాకు ఊహించని సర్‌ప్రైజ్: ప్రెగ్నెన్సీపై షాకింగ్ కామెంట్స్

Samantha: సమంత రూత్ ప్రభు తన ప్రెగ్నెన్సీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము పిల్లలు లేకపోయినా ఫర్వాలేదని అనుకున్నామని, కానీ ప్రెగ్నెన్సీ అని తెలిసే సరికి ఆశ్చర్యంగా ఫీలయ్యామని ఆమె చెప్పడం గమనార్హం.

Published on: Sep 10, 2026, 18:04:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. ఈ ప్రెగ్నెన్సీ తమకు ఒక ఊహించని మ్యాజికల్ సర్ ప్రైజ్ అని వ్యాఖ్యానించారు. రీసెంట్‌గా THR ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మాతృత్వంపై తన మనసులోని భావాలను ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.

Samantha: పిల్లలు లేకపోయినా సరే అనుకున్నాం.. అందుకే ఇది మాకు ఊహించని సర్‌ప్రైజ్: ప్రెగ్నెన్సీపై షాకింగ్ కామెంట్స్
Samantha: పిల్లలు లేకపోయినా సరే అనుకున్నాం.. అందుకే ఇది మాకు ఊహించని సర్‌ప్రైజ్: ప్రెగ్నెన్సీపై షాకింగ్ కామెంట్స్

పిల్లలు వద్దనుకున్నా..

ఒకప్పుడు అసలు పిల్లలు వద్దని, లైఫ్‌లో అందుకు తగినట్లుగా తాను తన మైండ్ సెట్ ఏర్పార్చుకున్నానని సమంత తెలిపారు. "రాజ్, నేను ఇద్దరం కూడా పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం. అసలు ఆ ఆలోచనే పక్కన పెట్టేసిన టైమ్‌లో ఈ గుడ్ న్యూస్ తెలిసింది. అందుకే ఇది మా ఇద్దరికీ ఒక ఊహించని సర్ ప్రైజ్" అని నవ్వుతూ చెప్పారు.

'థస్సాదియా' సాంగ్ షూటింగ్‌లోనే ప్రెగ్నెన్సీ విషయం రివీల్

'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ టైమ్‌లోనే తనకు ప్రెగ్నెన్సీ విషయం తెలిసిందని సమంత రివీల్ చేశారు. "ఫేమస్ 'థస్సాదియా' సాంగ్ ఫస్ట్ డే షూట్ రోజునే నాకు ప్రెగ్నెన్సీ విషయం తెలిసింది. ఆ టైమ్‌లోనే కొద్దిగా మార్నింగ్ సిక్‌నెస్, వాంతులు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ ఎనర్జెటిక్ డ్యాన్స్ స్టెప్పులు వేయాల్సి వచ్చింది" అని సమంత ఆనాటి క్షణాలను గుర్తుచేసుకున్నారు.

జూన్ నెలలో థియేటర్లలోకి వచ్చిన 'మా ఇంటి బంగారం' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సమంత క్లోజ్ ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత కడుపుతో ఉన్న విషయం తెలుసుకుని షూటింగ్ స్పాట్‌లో పూర్తి కేర్ తీసుకున్నామని డైరెక్టర్ నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే కార్ ఛేజ్ యాక్షన్ సీన్లు

'మా ఇంటి బంగారం' సినిమాలో కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, కార్ ఛేజ్ స్టంట్లు కూడా ఉన్నాయి. సమంత హెల్త్ కండిషన్‌ను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ నందిని రెడ్డి ఆమెకు ఎలాంటి అలసట రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎండ వేడికి సమంత ఇబ్బంది పడకుండా అవుట్‌డోర్ షూట్‌లో సరిపడా బ్రేక్స్ ఇచ్చామని మేకర్స్ తెలిపారు. సమంత ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ తన డెడికేషన్‌తో యాక్షన్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం నిజంగా విశేషం.

'సిటాడెల్' షూటింగ్ నుంచి ఇషా యోగా సెంటర్ వరకు..

సమంత, రాజ్ నిడిమోరు జంట 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో దగ్గరయ్యారు. అంతకుముందు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ కోసం వీరు కలిసి పనిచేశారు. డిసెంబర్ 2025లో కోయంబత్తూరు లోని ప్రసిద్ధ ఇషా యోగా సెంటర్‌లో యోగిక్ పద్ధతిలో వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత హెల్త్ ఇష్యూస్, మయోసైటిస్ లాంటి కష్ట సమయాలను అధిగమించిన సమంత.. ఇప్పుడు తన లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు. త్వరలోనే రాబోతున్న ఈ చిన్నారి రాక కోసం సమంత, రాజ్ ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More