ప్రభాస్, షారుక్ ఖాన్‌కూ సాధ్యం కాని ఘనత.. నాలుగు రూ.1000 కోట్లకుపైగా వసూళ్ల సినిమాలు ఉన్న ఏకైక ఇండియన్ స్టార్ ఇతడే

ప్రభాస్, షారుక్ ఖాన్ లాంటి వారికి కూడా సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. అతని ఖాతాలో ఏకంగా నాలుగు రూ.1000 కోట్ల క్లబ్ మూవీస్ ఉండటం విశేషం. ఇండియన్ సినిమాలో ఇదో అరుదైన ఘనత.

Published on: Apr 9, 2026, 14:43:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు ఇండియన్ సినిమాలకు 'రూ.100 కోట్ల క్లబ్' అనేది ఒక పెద్ద మైలురాయి. ఆమిర్ ఖాన్ ‘గజిని’తో మొదలైన ఈ ట్రెండ్ దాదాపు దశాబ్దం పాటు కొనసాగింది. అయితే రాజమౌళి ‘బాహుబలి 2’తో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటుతూ ‘రూ.1000 కోట్ల క్లబ్’ ఆవిర్భవించింది.

ప్రభాస్, షారుక్ ఖాన్‌కూ సాధ్యం కాని ఘనత.. నాలుగు రూ.1000 కోట్లకుపైగా వసూళ్ల సినిమాలు ఉన్న ఏకైక ఇండియన్ స్టార్ ఇతడే
ప్రభాస్, షారుక్ ఖాన్‌కూ సాధ్యం కాని ఘనత.. నాలుగు రూ.1000 కోట్లకుపైగా వసూళ్ల సినిమాలు ఉన్న ఏకైక ఇండియన్ స్టార్ ఇతడే

మొదట్లో ఈ క్లబ్‌లో బాహుబలి 2, దంగల్ మాత్రమే ఉండగా.. కోవిడ్ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ప్రస్తుతం ఈ రూ.1000 కోట్ల జాబితాలో మొత్తం 10 సినిమాలు చేరగా, అందులో ఇటీవలే ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు కూడా చేరిపోయాయి.

ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన గణాంకం బయటకు వచ్చింది. ఈ రూ.1000 కోట్ల క్లబ్ చిత్రాలలో అత్యధికంగా నటించిన నటుడు ఎవరో తెలుసా? షారుక్ ఖానో లేదా ప్రభాసో అనుకుంటే పొరపాటే.. ఆ రికార్డు సీనియర్ నటుడు సంజయ్ దత్ సొంతం.

సంజయ్ దత్.. నాలుగు రూ.1000 కోట్ల చిత్రాల సూపర్ స్టార్

1990వ దశకంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుల్లో ఒకరైన సంజయ్ దత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం రూ.1000 కోట్లు వసూలు చేసిన భారతీయ చిత్రాలలో 40% సినిమాల్లో సంజయ్ దత్ ఉండటం గమనార్హం.

కేజీఎఫ్: చాప్టర్ 2: అధీరగా సంజయ్ దత్ పోషించిన పాత్ర అతనికి తొలి రూ.1000 కోట్ల విజయాన్ని అందించింది.

జవాన్: షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంజయ్ అతిథి పాత్రలో కనిపించి తన ఖాతాలో రెండో రూ.1000 కోట్ల సినిమాను వేసుకున్నాడు.

ధురంధర్ 1 & 2: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రెండు సినిమాల్లోనూ సంజయ్ కీలక పాత్రలు పోషించాడు. ఈ రెండు సినిమాలు కూడా రూ.1000 కోట్ల మార్కును దాటడంతో సంజయ్ దత్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో సంజయ్ దత్ తర్వాత అత్యధిక చిత్రాలతో దీపికా పదుకోన్ (3 సినిమాలు - జవాన్, పఠాన్, కల్కి 2898 AD) రెండో స్థానంలో ఉంది.

ముందున్న మరిన్ని రికార్డులు

ఈ జాబితా ఇక్కడితో ఆగిపోయేలా లేదు. టికెట్ ధరలు పెరగడం, భారతీయ సినిమాలకు విదేశాల్లో పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే త్వరలోనే మరికొన్ని సినిమాలు ఈ క్లబ్‌లో చేరనున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’

నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రెండు భాగాల ‘రామాయణం’

ఈ సినిమాలతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్ వంటి తారలు కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాగే యష్ తన ఖాతాలో రెండో వెయ్యి కోట్ల సినిమాను వేసుకోనున్నాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఇండియాలో 1000 కోట్ల క్లబ్‌ను ప్రారంభించిన సినిమా ఏది?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలిసారి రూ.1000 కోట్ల మైలురాయిని అందుకుంది.

2. 1000 కోట్ల చిత్రాలలో అత్యధికంగా నటించిన నటి ఎవరు?

దీపికా పదుకోన్. ఆమె నటించిన పఠాన్, జవాన్, కల్కి 2898 AD చిత్రాలు ఈ రికార్డును సాధించాయి.

4. రణబీర్ కపూర్ 'యానిమల్' 1000 కోట్ల క్లబ్‌లో ఉందా?

లేదు. 'యానిమల్' మూవీ సుమారు రూ.915 కోట్ల వద్ద ఆగిపోయింది. నితీష్ తివారీ 'రామాయణం'తో రణబీర్ ఈ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

అత్యధిక రూ.1000 కోట్ల క్లబ్ సినిమాలున్న ఇండియన్ స్టార్స్
S Noనటుడుసినిమాలు
1సంజయ్ దత్4 (ధురంధర్ 2, ధురంధర్, జవాన్, కేజీఎఫ్ 2)
2దీపికా పదుకోన్3 (జవాన్, పఠాన్, కల్కి 2898 ఏడీ)
3ప్రభాస్2 (బాహుబలి 2, కల్కి 2898 ఏడీ)
3రణ్‌వీర్ సింగ్2 (ధురంధర్, ధురంధర్ 2)
3షారుక్ ఖాన్2 (జవాన్, పఠాన్)
3సాన్యా మల్హోత్రా2 (దంగల్, జవాన్)
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More