...
...
Next Story

వాళ్ల అమ్మ చేతి భోజనం చేశా.. విష్వక్ సేన్ ఫంకీ మూవీ బాగా ఆడాలి.. మాకు సెట్ కాలేదు అంతే: అర్జున్

సీనియర్ హీరో అర్జున్ సర్జా, యంగ్ హీరో విష్వక్ సేన్ మధ్య విభేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ మూవీ నుంచి విష్వక్ తప్పుకొన్నాడు కూడా. అయితే ఇప్పుడు విష్వక్ మూవీ ఫంకీ, అర్జున్ డైరెక్ట్ చేసిన సీతా పయనం ఒక రోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published on: Feb 8, 2026, 20:53:03 IST
Advertisement

సీనియర్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ ‘సీతా పయనం’. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కూడా అతనే. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. విష్వక్ సేన్ ఫంకీ మూవీ గురించి మాట్లాడాడు.

సీతా పయనం వర్సెస్ ఫంకీ

అర్జున్ సర్జా (instagram-Arjun Sarja)
అర్జున్ సర్జా (instagram-Arjun Sarja)

అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ సీతా పయనం. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరోవైపు విష్వక్ సేన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు క్లాష్ కానున్నాయి.

అర్జున్ కామెంట్లు

ఫంకీ సినిమాతో తన సినిమా సీతా పయనం పోటీ పడటం పట్ల అర్జున్ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సీతా పయనం సినిమాలో ముందు హీరోగా విష్వక్ సేన్ అనుకున్నారు. షూటింగ్ కూడా చేశారు. కానీ మధ్యలో గొడవల కారణంగా విష్వక్ తప్పుకున్నాడు.

ఇంటర్వ్యూలో అర్జున్ కు ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో విష్వక్ సేన్ ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుంది, మీ సినిమా 14 నాడు వస్తుందనే ప్రశ్న ఎదురైంది.

వాళ్ల ఇంట్లో భోజనం

‘‘ఆ సినిమా కూడా చాలా బాగా ఆడాలి. అతనో యంగ్ బాయ్. వాళ్ల సినిమా బాగా ఆడాలి. ఏదో మనకు కుదరలేదు. మేం సినిమా చేయలేదు. వాళ్ల అమ్మ చేతి భోజనం చేశా. వాళ్లు బాగుండాలి. అందరూ బాగుండాలి. ఆ సినిమా బాగా ఆడాలి. మా సినిమా బాగా ఆడాలి. ఎవరి మీద కోపం లేదు. లైఫ్ మూవ్ అవుతూ ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి’’ అని అర్జున్ అన్నాడు.

తండ్రి డైరెక్షన్

అర్జున్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఐశ్వర్య. 2013లో తమిళ సినిమా పట్టతు యానై మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది ఐశ్వర్య. 2018లో కన్నడలో ప్రేమ బరహ మూవీ చేసింది. అదే ఏడాది తమిళంలో సొల్లివిడవ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో సీతా పయనంతో అడుగుపెడుతోంది ఐశ్వర్య.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks