ఒకేసారి ఐదుగురితో రొమాంటిక్ చాటింగ్- విదేశంలో ప్రియుడి గుట్టు రట్టు చేసిన షనయ కపూర్- లైగర్ హీరోయిన్ సలహాతో అలా!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షనయ కపూర్ తన పాత ప్రేమాయణంలోని చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. విదేశాల్లో సరదాగా గడుపుతున్న సమయంలో తన ప్రియుడు ఐదుగురు అమ్మాయిలతో సీక్రెట్గా మెసేజ్లు చేస్తూ దొరికిపోయాడని, ఆ మోసం తనను ఎంతగా కలచివేసిందో ‘రిలేషన్షిట్ అడ్వైస్’ పాడ్కాస్ట్లో వివరించారు.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనయ కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రేమ, నమ్మకం, వెన్నుపోటు వంటి అంశాలపై స్పందిస్తూ.. తన మాజీ ప్రియుడు చేసిన మోసాన్ని తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించారు బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్.

పర్ఫెక్ట్ అనుకున్న బంధంలో ఊహించని మలుపు
అది షనాయా కపూర్ కెరీర్ ఆరంభంలో జరిగిన సంఘటన. తన ప్రియుడితో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. "మా మధ్య బంధం చాలా అద్భుతంగా సాగుతోందని, నా జీవితంలో దొరికిన బెస్ట్ పార్ట్నర్ ఇతడే అని నేను గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని" అని షనయ కపూర్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ ప్రయాణమే ఆమె కళ్లు తెరిపించిందని చెప్పుకొచ్చారు.
క్యాబ్ బుక్ చేయబోతే కన్పించిన అసలు రంగు
ఒకరోజు రాత్రి డిన్నర్కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, షనయ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. దీంతో క్యాబ్ బుక్ చేయడం కోసం తన ప్రియుడి ఫోన్ తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అతడి మాజీ ప్రేయసి నుంచి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది.
అనుమానంతో చాట్ ఓపెన్ చేసిన షనయకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. కేవలం మాజీ ప్రేయసి మాత్రమే కాదు.. మరో నలుగురు అమ్మాయిలతో అతను రొమాంటిక్ చాటింగ్ చేస్తున్నట్లు షనయ గుర్తించారు. "ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు అమ్మాయిలతో అతను సింగిల్గా ఉన్నట్లు నటిస్తూ మెసేజ్లు చేస్తున్నాడు" అని షనయ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనన్య పాండే సలహా.. మూడు రోజుల నటన
వెంటనే ఆ చాట్లను స్క్రీన్ షాట్లు తీసి తన సన్నిహితులకు పంపారు షనయ. అందులో తన ప్రాణ స్నేహితురాలు, లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఉన్నారు. "వెంటనే అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నా దగ్గరికి వచ్చేయ్" అని అనన్య పాండే సలహా ఇచ్చినా, విదేశీ గడ్డపై ఒంటరిగా అలా రావడం సాధ్యం కాలేదని షనయ చెప్పారు. దీంతో తనకేమీ తెలియనట్లుగా మరో మూడు రోజుల పాటు అతనితోనే ఉంటూ మామూలుగా నటించాల్సి వచ్చిందని షనయ తెలిపారు.
చివరికి ప్రియుడికి అనుమానం వచ్చి ఒక ఖరీదైన ఇయర్ రింగ్స్ (చెవి పోగులు) కొనిచ్చి షనయను ప్రసన్నం చేసుకోవాలని చూశాడు. "అవన్నీ చూసి నేను నవ్వుకున్నాను. వాటిని 'గిల్టీ ఇయర్ రింగ్స్' అని పిలుస్తూనే, ఆ తర్వాత అతడికి గుడ్ బై చెప్పేశాను. ఇప్పటికీ ఆ పోగులు నా దగ్గరే ఉన్నాయి.. ఆ బాధను అనుభవించినందుకు అవి నాకు దక్కిన బహుమతి అనుకుంటాను" అని షనయ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
షనయ సినిమా విశేషాలు
ప్రస్తుతం షనయ కపూర్ తన లేటెస్ట్ మూవీ ‘తూ యా మైన్’ (Tu Yaa Main) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో ఆదర్శ్ గౌరవ్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 13) విడుదలైంది.

E-Paper












