...
...
Next Story

Shresta Iyer: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ కోసం అమ్మాయిలు వేసిన మాస్టర్ ప్లాన్.. అసలు నిజాలు బయటపెట్టి షాకిచ్చిన చెల్లెలు

Shresta Iyer: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్ఠ అయ్యర్ ఈ మధ్యే లాక్ అప్ 2 నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

Published on: Jul 9, 2026, 15:53:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shresta Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్, ఈ మధ్యే టీ20 టీమ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సోదరి శ్రేష్ఠ అయ్యర్ (Shresta Iyer) రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'లాక్ అప్ 2' (Lock Upp 2) రియాలిటీ షో నుంచి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయింది. స్టార్ క్రికెటర్ చెల్లెలు అనే ట్యాగ్ నుంచి బయటపడి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే టార్గెట్ తో షోలో అడుగుపెట్టిన శ్రేష్ఠ.. బయటకొచ్చాక ఫిల్మీజ్ఞాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.

అమ్మాయిల మాస్టర్ ప్లాన్స్ పసిగట్టేశా

Shresta Iyer: మా అన్న శ్రేయస్ అయ్యర్‌కు దగ్గర కావడానికి చాలా మంది గర్ల్స్ నాతో స్నేహం నటించారు: శ్రేయస్ చెల్లెలు శ్రేష్ట
Shresta Iyer: మా అన్న శ్రేయస్ అయ్యర్‌కు దగ్గర కావడానికి చాలా మంది గర్ల్స్ నాతో స్నేహం నటించారు: శ్రేయస్ చెల్లెలు శ్రేష్ట

తన అన్నయ్య శ్రేయస్ అయ్యర్ స్టార్ డమ్, క్రేజ్ ను వాడుకోవడానికి చాలామంది అమ్మాయిలు ట్రై చేశారని శ్రేష్ఠ ఓపెన్ గా చెప్పేసింది. శ్రేయస్ కు దగ్గరవ్వడం కోసమే కొందరు అమ్మాయిలు తనతో కావాలని క్లోజ్ అయ్యారని, తనతో ఫేక్ ఫ్రెండ్ షిప్ చేశారని ఆమె అసలు గుట్టు విప్పేసింది.

"నిజానికి చాలామంది అమ్మాయిలు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారు. కానీ వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు వెంటనే అర్థమైపోయేది. ఆ టైమ్ లో నేను సైలెంట్ గా వాళ్లకి దూరం జరిగేదాన్ని" అని శ్రేష్ఠ క్లారిటీ ఇచ్చింది. అన్నయ్య విషయంలో తాను చాలా శ్రద్ధ చూపిస్తానని, అతనికి కరెక్ట్ అమ్మాయి సెట్ అవ్వాలన్నదే తన కోరిక అని ఆమె ఎమోషనల్ అయింది.

లైఫ్ పార్ట్‌నర్ సెలెక్షన్ లో నా మాటే ఫైనల్?

ఒక అమ్మాయి ఇంటెన్షన్ ఏంటో మరో అమ్మాయికి ఇట్టే తెలిసిపోతుందని శ్రేష్ఠ గట్టిగా వాదిస్తోంది. "శ్రేయస్ కు ఎవరైనా నచ్చితే కచ్చితంగా నా ఒపీనియన్ అడుగుతాడని ఆశిస్తున్నాను. అబ్బాయిల మైండ్ సెట్ అబ్బాయిలకు ఎలా తెలుస్తుందో, అమ్మాయిల క్యారెక్టర్ కూడా మాకు అలానే అర్థమవుతుంది" అంటూ తన అన్న లైఫ్ పార్ట్‌నర్ సెలెక్షన్ లో తన పాత్ర కచ్చితంగా ఉంటుందని హింట్ ఇచ్చింది.

ఇక 'లాక్ అప్ 2' హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చిన క్యూట్ వీడియోను శ్రేష్ఠ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సూట్ కేస్ పట్టుకుని ఆమె ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే, టీవీలో షో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా డాన్స్ చేస్తూ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మళ్లీ నా వాళ్ల దగ్గరికి రావడం చాలా హ్యాపీగా ఉందంటూ శ్రేష్ఠ ఆ పోస్ట్ కు క్యాప్షన్ పెట్టింది.

శ్రేష్ఠ ఎలిమినేషన్ పై నెటిజన్లు, ఫ్యాన్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. "నువ్వు ఎప్పటికీ క్వీన్ వి, నీ ప్యూర్ హార్ట్ అందరికీ నచ్చింది.. బ్యాక్ టు హోమ్" అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన 'లాక్ అప్' ఫస్ట్ సీజన్ ఆల్ట్ బాలాజీ, ఎమ్‌ఎక్స్ ప్లేయర్ లో సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఇప్పుడు సెకండ్ సీజన్ కు మేకర్స్ కంప్లీట్ మేకోవర్ ఇచ్చారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా.. నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ కాంట్రవర్షియల్ రియాలిటీ షో స్ట్రీమింగ్ అవుతూ ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe