ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నాడు. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని, ప్రస్తుతం బెయిల్పై ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో కలిసి పనిచేసినందుకు రెహమాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెహమాన్ తో తరచుగా కలిసి పనిచేసే సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని ఓ నెటిజన్ ప్రశ్నించినప్పుడు.. తాను రెహమాన్ ను ప్రశ్నించినట్లు సంచలన విషయాన్ని బయటపెట్టింది.
రెహమాన్నూ నిలదీశా

పెద్ది మూవీ కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో కలిసి ఫొటో దిగినందుకు, పనిచేసినందుకు ఏఆర్ రెహమాన్ పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక 'ఎక్స్' యూజర్ చిన్మయిని టార్గెట్ చేస్తూ.. రెహమాన్ ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “అక్క (చిన్మయి) మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రెహమాన్. ఆమెది దొంగల నైజం!!” అని ఆ యూజర్ పోస్ట్ చేశారు.
దీనిపై చిన్మయి ఘాటుగా స్పందిస్తూ ఇలా బదులిచ్చింది. “ఓహ్, దయచేసి నోరు మూసుకో. నేను సర్ను (రెహమాన్) అడిగాను. తనకు దీని గురించి ఏమీ తెలియదు అని చెప్పారు. నేను తమిళ చలనచిత్ర పరిశ్రమలోని ముఖ్యమంత్రులను, అతిపెద్ద నటులను కూడా ప్రశ్నించాను” అని చెప్పింది.
కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను
తనపై వేధింపులకు పాల్పడ్డాడని గీత రచయిత వైరముత్తు గురించి చెప్పినప్పటి నుంచీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఆమె తెలిపింది. “కోర్టుకు వెళుతూ, వేధింపులకు గురవుతున్నది మీరు కాదు. అందువల్ల శక్తివంతమైన వ్యక్తులు కూడా వేధింపులకు పాల్పడిన వ్యక్తితో పని చేశాడని తెలుసుకొని, నన్ను నిలదీయడం ఆపండి.
మీరంతా మీ ఆదర్శమూర్తులను ప్రశ్నించవచ్చు. నేను ఎల్లప్పుడూ ఈ పనిని చేయలేను. నేను చేశాను. చాలా నష్టపోయాను. చాలా తిట్లు తిన్నాను. చాలా వేధింపులకు గురయ్యాను. మీరు పోగొట్టుకోవడానికి ఏమీ లేని, అజ్ఞాత ట్విటర్ హ్యాండిల్!” అని ఆ యూజర్కు చిన్మయి గట్టి సమాధానం ఇచ్చింది.
జానీ మాస్టర్తో రెహమాన్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నవంబర్ 9న ఇన్స్టాగ్రామ్లో రెహమాన్, 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి' పాటకు అతడే కొరియోగ్రఫీ అందించాడు. ఈ ఫోటోలు బయటపడగానే జానీతో పనిచేసినందుకు, ఫొటోలు దిగినందుకు పలువురు సోషల్ మీడియాలో రెహమాన్ను విమర్శించడం మొదలుపెట్టారు. "ఆయనకు (జానీ మాస్టర్) ఆరోపణల గురించి తెలియదంటే నమ్మడం కష్టమే" అని రెడిట్లో ఒక కామెంట్ వచ్చింది.
జానీ మాస్టర్పై కేసు వివరాలు
{{/usCountry}}కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నవంబర్ 9న ఇన్స్టాగ్రామ్లో రెహమాన్, 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి' పాటకు అతడే కొరియోగ్రఫీ అందించాడు. ఈ ఫోటోలు బయటపడగానే జానీతో పనిచేసినందుకు, ఫొటోలు దిగినందుకు పలువురు సోషల్ మీడియాలో రెహమాన్ను విమర్శించడం మొదలుపెట్టారు. "ఆయనకు (జానీ మాస్టర్) ఆరోపణల గురించి తెలియదంటే నమ్మడం కష్టమే" అని రెడిట్లో ఒక కామెంట్ వచ్చింది.
జానీ మాస్టర్పై కేసు వివరాలు
{{/usCountry}}జానీ మాస్టర్ను గత ఏడాది సెప్టెంబర్లో గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చారు. అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఒక మహిళ.. 2020లో ముంబైలో జరిగిన ఒక వర్క్ ట్రిప్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత కూడా వేధించాడని, బెదిరించాడని ఆరోపించింది. ఆ ఆరోపణ జరిగిన సమయంలో ఆమె మైనర్ అని ఆ స్టేట్మెంట్లో వెల్లడి కావడంతో, ఇతర సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణల కారణంగా జానీ మాస్టర్కు వచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డును నిలిపివేశారు. ప్రస్తుతం అతడు బెయిల్పై బయట ఉన్నాడు.